ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగటం.. కొత్త ఛైర్మన్లు.. మేయర్లు వచ్చేయటం తెలిసిందే. మొత్తం 11 మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పది చోట్ల పూర్తిగా కొత్తవాళ్లే మేయర్లుగా ఎన్నిక కావటం సంచలనంగా మారింది. ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేని వారికి మేయర్ పదవిని కట్టబెట్టటం ద్వారా జగన్ తనదైన ముద్రను వేయటమే కాదు.. కొత్త నాయకత్వానికి తెర తీశారు. కొత్తగా మేయర్ పదవుల్ని చేపట్టిన వారిలో అత్యధికులు సామాన్య జీవితాన్ని గడిపేవారు అయితే.. కొందరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు సాగుతున్న రాజకీయానికి పూర్తి భిన్నమైన రాజకీయాన్ని ప్రదర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
అనంతపురం మేయర్ గా ఎన్నికైన వసీం సంగతే తీసుకోండి. అతగాడికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కాకుంటే.. వసీం తండ్రి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి సహోధ్యాయి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా.. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో కార్పొరేటర్ గా బరిలోకి దిగి.. ఏకంగా మేయర్ అయిపోయారు. చిత్తూరు మేయర్ అముద గురించి తెలిస్తే మరింత ఆశ్చర్యపోవాలి. పదో తరగతి వరకు చదివిన ఆమె.. ఒంటరిగా జీవిస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్పి బతుకు బండి లాగిస్తున్నారు. ఆమె ఇంటి పక్కనే ఉండే సోదరుడు ఆమెకు అండగా ఉంటున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు చిత్తూరు మేయర్ గా మారిపోయారు.
తిరుపతి మేయర్ కూడా రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆమె కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మేయర్ గా ఎన్నికైన శిరీష.. ఆమె భర్త తిరుపతిలో వైద్యులుగా పని చేస్తున్నారు. ప్రైవేటుఆసుపత్రి నిర్వహిస్తున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మద్దతుతో కార్పొరేటర్ గా బరిలోకి దిగిన ఆమె..ఇప్పుడు ఏకంగా నగరానికే ప్రథమ పౌరురాలిగా మారిపోయారు. విజయనగరం మేయర్ విజయలక్ష్మిది కూడా సాదాసీదా జీవనమే. ఆమె భర్త స్థానిక ఎమ్మెల్యే కంపెనీలో ఉద్యోగి. స్థానిక పరిణామాల నేపథ్యంలో ఆమెకు మేయర్ పదవి దక్కింది. ఇలా పలువురు మేయర్లను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. కొత్తగా పదవులు ఇచ్చి అందలం ఎక్కించటం ద్వారా.. జగన్ తన మార్కును ప్రదర్శించారని చెప్పాలి.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…