స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కనిపించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూకుడుగా ముందుకు సాగడం కావొచ్చు.. ప్రత్యర్థులు కేసుల భయంతో వెనక్కి తగ్గడమే కావొచ్చు.. మొత్తానికి మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ పాగా వేసింది. అయితే.. ఇంత దూకుడు చూపించినా.. జోరు విజయం సాధించినా.. వైసీపీలో మాత్రం అసంతృప్తి కనిపిస్తోందని అంటు న్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. రెండు మునిసిపాలిటీలు తమకు దక్కక పోవడమే! అవి రెండూ కూడా టీడీపీ నేతలకు దక్కడమే!! అందునా.. మరీ ముఖ్యంగా జగన్పై ఒంటికాలిపై లేస్తున్న జేసీ కుటుంబానికి ఒకటి మద్దతుగా మారడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీ వైసీపీకి దక్కలేదు. కానీ, జిల్లా మొత్తం ఓడిపోయి.. ఇదొక్కటి మాత్రం సాధించా లని.. జేసీ వర్గాన్ని తుక్కుకింద ఓడించాలని.. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేసిన 24వ డివిజన్లో విజయం దక్కించుకోవాలని ఆది నుంచి కూడా ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు తీవ్రంగా శ్రమించారు. అయితే.. జేసీ వర్గం నుంచి సేవ్ తాడిపత్రి నినాదాన్ని తెరమీదికి తెచ్చి.. సెంటిమెంటును రగిలించింది. దీంతో అనూహ్యంగా తాడిపత్రిలో వైసీపీకి మెజారిటీ దక్కలేదు. ఇక్కడ మొత్తం 36 డివిజన్లు ఉన్నాయి. వీటిలో వైసీపీ 2 ఏకగ్రీవం చేసుకుంది.
దీంతో 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ జేసీ వర్గం 18 డివిజన్లు సంపాయించుకుంది. ఇక, వైసీపీ 14కు పరిమిత మైంది. ఇక, టీడీపీ మద్దతు పార్టీ సీపీఐ అభ్యర్థి ఒక వార్డులోను, స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులోను విజయం సాధించారు. దీంతో ఎవరు మెజారిటీ సాధించాలన్నా.. తాడిపత్రి మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలన్నా.. 20 మంది అభ్యర్థుల మద్దతు అవసరం. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం.. టీడీపీకి సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో 20 మంది మెజారిటీ ఉంది. కానీ, జేసీపై ఉన్న వ్యక్తిగత రాజకీయ కక్షల నేపథ్యంలో ఇక్కడ వైసీపీ పాగా వేసేందుకు కుటిల యత్నాలు ప్రారంభించిందని.. ఈ వర్గం ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో ఇక్కడే మకాం వేసిన రాయలసీమకు చెందిన కీలక మంత్రి ఒకరు.. చక్రం తిప్పుతున్నారని.. సామ, దాన, భేద దండోపాయాలు వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 21, 22, 23 డివిజన్ల అభ్యర్థులకు స్థానికం గా షాపింగ్ కాంప్లెక్సులు, వ్యాపారాలు ఉండడంతో వీరిని టార్గెట్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్ అఫిషియో ఓట్లను కూడా వైసీపీ వినియోగిస్తోంది. అదేసమయంలో టీడీపీకి ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యులు.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విషయంలో మాత్రం న్యాయ వివాదాలు సృష్టించింది. దీంతో ఈ వ్యవహారం.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నెల 18 లోపు ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ అభ్యర్థులను తమవైపు తిప్పుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు.
This post was last modified on March 17, 2021 9:21 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…