జగన్ కేబినెట్లోకి ఫైర్ బ్రాండ్ రోజా రానున్నారా ? తనకు ఇప్పుడున్న ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఆమె ఇష్టం లేకుండానే భరిస్తున్నారా? దీనిని వదులుకుని.. తను మంత్రి వర్గంలో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు, సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న గుసగుస వంటివి ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి 2019లో జగన్ సర్కారు ఏర్పాటు అయినప్పుడే.. రోజాకు మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. అప్పట్లో చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చిన జగన్ ఒకే సామాజిక వర్గం కావడంతో రోజాను పక్కన పెట్టారు.
ఈ క్రమంలోనే రోజాను గుర్తిస్తూ.. ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవిని అప్పగించారు. అయితే.. ఆమె ఇష్టం లేక పోయినా జగన్ ఇవ్వడంతో తీసుకున్నారు. అయినప్పటికీ.. ఆమె మనసు పెట్టి ఏపీఐఐసీలో పనిచేసింది లేదు. ఏదో ముక్తసరిగా మీటింగులకు హాజరవడం.. అటెండెన్స్ వేయించుకునేందుకే పరిమితమయ్యారు. రెండు కీలక పదవుల్లో ఉండి కూడా ఆమె టీవీ షోలు మానలేదు. ఈ క్రమంలో తనను తాను నిరూపించుకుని.. జగన్ దగ్గర మార్కులు సంపాయించుకునేందుకు ఇటీవల జరిగిన నగరి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనధికార వర్గాల కథనం మేరకు దాదాపు రు. 5 కోట్ల రూపాయల వరకు ఇక్కడ రోజా ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఆమె నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు, నగరి రెండు మున్సిపాల్టీలను ఆమె సొంతం చేసుకున్నారు.
పార్టీలో తనకున్న వ్యతిరేకతను కూడా అధిగమించిన రోజా.. ప్రజలు తనవైపే ఉన్నారని నిరూపించుకు న్నారు. ఈ క్రమంలో తన మనసులో ని కేబినెట్ ఆశలను జగన్తో చెప్పుకొనేందుకు హుటాహుటిన ఆమె తాడేపల్లికి చేరుకున్నారు. పైకి మాత్రం జగన్ను అభినందించేందుకు వచ్చారని ప్రచారం సాగుతున్నా.. సీనియర్ నాయకులు మాత్రం రోజా.. గట్టి ప్రతిపాదనతోనే వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా సాగుతుండడం గమనార్హం.
అయితే.. ఇప్పటికే ఉన్న పెద్దిరెడ్డి.. రోజాకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు జగన్ అవకాశం ఇస్తారా ? అనేది కీలక ప్రశ్న. ఎవరి మంత్రి పదవి ఉన్నా పోయినా పెద్దిరెడ్డికి డోకా లేదు. అదే సమయంలో రోజా వంటి నాయకురాలికి అవకాశం ఇవ్వకపోతే.. మహిళల్లో ఎలాంటి సంకేతాలు వస్తాయనేది మరో ప్రశ్న. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 16, 2021 12:54 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…