Political News

మంత్రి వ‌ర్గంలోకి రోజా.. తాడేప‌ల్లి ప‌ర్య‌ట‌న అందుకేనా ?

జ‌గ‌న్ కేబినెట్‌లోకి ఫైర్ బ్రాండ్ రోజా రానున్నారా ? త‌న‌కు ఇప్పుడున్న ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆమె ఇష్టం లేకుండానే భ‌రిస్తున్నారా? దీనిని వ‌దులుకుని.. త‌ను మంత్రి వ‌ర్గంలో చోటు కోసం విశ్వ‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు, సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న గుస‌గుస వంటివి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి 2019లో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్పాటు అయిన‌ప్పుడే.. రోజాకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అవ‌కాశం ఇచ్చిన జ‌గ‌న్ ఒకే సామాజిక వ‌ర్గం కావ‌డంతో రోజాను ప‌క్క‌న పెట్టారు.

ఈ క్ర‌మంలోనే రోజాను గుర్తిస్తూ.. ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. ఆమె ఇష్టం లేక పోయినా జ‌గ‌న్ ఇవ్వ‌డంతో తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె మ‌న‌సు పెట్టి ఏపీఐఐసీలో ప‌నిచేసింది లేదు. ఏదో ముక్త‌స‌రిగా మీటింగుల‌కు హాజ‌ర‌వ‌డం.. అటెండెన్స్ వేయించుకునేందుకే ప‌రిమిత‌మ‌య్యారు. రెండు కీల‌క ప‌ద‌వుల్లో ఉండి కూడా ఆమె టీవీ షోలు మాన‌లేదు. ఈ క్ర‌మంలో త‌న‌ను తాను నిరూపించుకుని.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు సంపాయించుకునేందుకు ఇటీవ‌ల జ‌రిగిన న‌గ‌రి ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అన‌ధికార వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు దాదాపు రు. 5 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఇక్క‌డ రోజా ఖ‌ర్చు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి అనుకున్న‌ది సాధించారు. ఆమె నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పుత్తూరు, న‌గ‌రి రెండు మున్సిపాల్టీల‌ను ఆమె సొంతం చేసుకున్నారు.

పార్టీలో త‌న‌కున్న వ్య‌తిరేక‌త‌ను కూడా అధిగ‌మించిన రోజా.. ప్ర‌జ‌లు త‌న‌వైపే ఉన్నార‌ని నిరూపించుకు న్నారు. ఈ క్ర‌మంలో త‌న మ‌న‌సులో ని కేబినెట్ ఆశ‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకొనేందుకు హుటాహుటిన ఆమె తాడేప‌ల్లికి చేరుకున్నారు. పైకి మాత్రం జ‌గ‌న్‌ను అభినందించేందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం సాగుతున్నా.. సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం రోజా.. గ‌ట్టి ప్ర‌తిపాద‌న‌తోనే వ‌చ్చార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇప్ప‌టికే ఉన్న పెద్దిరెడ్డి.. రోజాకు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తారా ? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఎవ‌రి మంత్రి ప‌ద‌వి ఉన్నా పోయినా పెద్దిరెడ్డికి డోకా లేదు. అదే స‌మ‌యంలో రోజా వంటి నాయ‌కురాలికి అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే.. మ‌హిళ‌ల్లో ఎలాంటి సంకేతాలు వ‌స్తాయ‌నేది మ‌రో ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఇది తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 16, 2021 12:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

14 minutes ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

1 hour ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

2 hours ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

2 hours ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

5 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

6 hours ago