Political News

యాదాద్రి: ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ అదుపులో 90 మంది

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి దగ్గర్లో చోటు చేసుకున్న ఆరాచకం గురించి తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంత భారీగా ఇలాంటి భాగోతాలు నడుస్తున్నాయా? అని విస్మయానికి గురి అవుతున్నారు. హైదరాబాద్ శివారులో జరిగే రేవ్ పార్టీలకుమించిన రేవ్ పార్టీ తాజాగా యాదాద్రిలో జరగటం.. దాన్నిపోలీసులు భగ్నం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

సంస్థాన్ నారాయణపూర్ లోని ఒక ఫాంహౌస్ లో భారీ ఎత్తున రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. జక్కిడి ధన్వంతరెుడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా అతిధులు హాజరయ్యారు. ఇరవై కార్లు.. అరవై బైకులు పోలీసులకే దొరికాయంటే.. వాస్తవానికి మరెన్ని అక్కడకు వెళ్లి ఉంటాయన్నది అర్థం చేసుకోవచ్చు.

పక్కాగా అందిన సమాచారంతో రేవ్ పార్టీని భగ్నం చేసేందుకు డీసీపీ నారాయణరెడ్డి.. ఏసీపీ సత్తయ్యలు టీంలు పక్కాగా ప్లాన్ చేశాయి. రేవ్ పార్టీకి వచ్చిన 90 మంది యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి లాంటి చోట నిర్వహించిన రేవ్ పార్టీకి ఇంత భారీగా హాజరు కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీని వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై పోలీసులు లోతుడా విచారణ జరుపుతున్నారు. పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున మద్యం.. డ్రగ్స్ తో పాటు.. అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

This post was last modified on March 12, 2021 10:41 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

7 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

11 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago