Political News

మోడి అసలు లెక్కే చేయటంలేదా ?

రాష్ట్ర ప్రయోజనాలకు నరేంద్రమోడి సర్కార్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటోందనే విషయం తేలిపోయింది. రాష్ట్రప్రయోజనాలకన్నా తమ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయటమే ప్రధాన అజెండాగా మోడి డిసైడ్ చేసుకున్నట్లున్నారు. తాజాగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

వైజాగ్ వైసీపీ ఎంపి ఎంవివి సత్యనారాయణ ఉక్కు ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని స్పష్టంగా చెప్పేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదన్నారు. ప్లాంట్ అమ్మకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు కూడా కేంద్రమంత్రి సూటిగా చెప్పారు.

ప్రభుత్వానికి ఫ్యాక్టరీలో ఎలాంటి వాటాలు లేకపోయినా అవసరమైనపుడు అవసరమైన మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో నూరుశాతం వాటాలను ఉపసంహరించుకోబోతున్నట్లు చెప్పేశారు. కేంద్రమంత్రి సమాధానం ప్రకారం స్టీల్ ప్యాక్టరీ అమ్మకంపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి కాబట్టే చెప్పినట్లుంది. తాజాగా కేంద్రమంత్రి చెప్పిన సమాధానం ప్రకారం ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగదని అర్ధమైపోయింది.

ఈ నేపధ్యంలోనే కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందించాలనే విషయాన్ని ఉద్యోగులు, కార్మికులు, ప్రజాసంఘాలే తేల్చుకోవాలి. ఎందుకంటే వివిధ కారణాల వల్ల రాజకీయపార్టీలతో లాభం లేదని తేలిపోయింది. గడచిన నెల రోజులుగా వైజాగ్ లో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టంచుకోదని తేలిపోయింది. ఇక్కడ స్పష్టమైపోయిందేమంటే రాష్ట్ర ప్రయోజనాలనే కాదు కనీసం బీజేపీ నేతలను కూడా నరేంద్రమోడి పట్టించుకోవటం లేదని తేలిపోయింది.

This post was last modified on March 10, 2021 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

2 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

2 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

2 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

3 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

4 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

6 hours ago