వ్యాపారం అన్న తర్వాత నష్టం వస్తుందా? వస్తే.. అసలు వ్యాపారం ఎందుకు చేస్తారు? కొంతకాలం లాభం వచ్చి.. ఆ తర్వాత నష్టం వస్తున్నదంటే ఏదో తేడా ఉన్నట్లేగా? అయినా.. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయటం గొప్ప. దాన్ని అమ్మేయటం ఎంతసేపు? ఆస్తులు కూడబెట్టటంలో ఉన్న కష్టం.. అమ్మటం ఏమంత విషయం కాదు. కానీ.. మోడీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగంలో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయటం కంటే.. ఇప్పటికే ఉన్న సంస్థల్ని అమ్మేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దేశంలోని 30 ప్రభుత్వ రంగ సంస్థలు గడిచిన ఐదేళ్లుగా నష్టాల్లో నడుస్తున్నాయని.. వాటిని వదిలించుకోవాలని కేంద్రం భావించటం గమనార్హం. ఇదే విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాలా రాజ్యసభకు తెలిపారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు అంటే.. 2016లో కేంద్రం అధీనంలోని 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకొని.. వాటిని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు.
2019-20 నాటికి ఈ సంస్థల కారణంగా కేంద్రానికి వచ్చిన నష్టం రూ.30,131 కోట్లుగా తెలిపారు. 35 సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటివరకు ఎనిమిది సంస్థల్లో ఆ పని పూర్తి అయ్యిందని.. వాటి ద్వారా రూ.66,712 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 2021-22 నాటికి ఇదే తీరులో వ్యవహరించి రూ.1.75లక్షల కోట్లు ఆర్జించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్పారు. నష్టాల్లో నడుస్తున్న కంపెనీల్లో 50,291 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం ఇప్పటికే పెట్టుబడుల్ని ఉపసంహరించిన సంస్థలు ఇదే
ప్రైవేటు పరం చేయాలని డిసైడ్ చేసిన సంస్థలు
This post was last modified on March 9, 2021 11:01 am
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…