వ్యాపారం అన్న తర్వాత నష్టం వస్తుందా? వస్తే.. అసలు వ్యాపారం ఎందుకు చేస్తారు? కొంతకాలం లాభం వచ్చి.. ఆ తర్వాత నష్టం వస్తున్నదంటే ఏదో తేడా ఉన్నట్లేగా? అయినా.. ఏదైనా సంస్థను ఏర్పాటు చేయటం గొప్ప. దాన్ని అమ్మేయటం ఎంతసేపు? ఆస్తులు కూడబెట్టటంలో ఉన్న కష్టం.. అమ్మటం ఏమంత విషయం కాదు. కానీ.. మోడీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగంలో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయటం కంటే.. ఇప్పటికే ఉన్న సంస్థల్ని అమ్మేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దేశంలోని 30 ప్రభుత్వ రంగ సంస్థలు గడిచిన ఐదేళ్లుగా నష్టాల్లో నడుస్తున్నాయని.. వాటిని వదిలించుకోవాలని కేంద్రం భావించటం గమనార్హం. ఇదే విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాలా రాజ్యసభకు తెలిపారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు అంటే.. 2016లో కేంద్రం అధీనంలోని 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకొని.. వాటిని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు.
2019-20 నాటికి ఈ సంస్థల కారణంగా కేంద్రానికి వచ్చిన నష్టం రూ.30,131 కోట్లుగా తెలిపారు. 35 సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటివరకు ఎనిమిది సంస్థల్లో ఆ పని పూర్తి అయ్యిందని.. వాటి ద్వారా రూ.66,712 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 2021-22 నాటికి ఇదే తీరులో వ్యవహరించి రూ.1.75లక్షల కోట్లు ఆర్జించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్పారు. నష్టాల్లో నడుస్తున్న కంపెనీల్లో 50,291 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం ఇప్పటికే పెట్టుబడుల్ని ఉపసంహరించిన సంస్థలు ఇదే
ప్రైవేటు పరం చేయాలని డిసైడ్ చేసిన సంస్థలు
This post was last modified on March 9, 2021 11:01 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…