పదునైన వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే పంచ్ లు వేసే ఆర్కే రోజా తరచుగా మీడియాలో నిలుస్తుంటారు. చురుగ్గా.. చలాకీగా ఉండటమే కాదు.. మీడియాలో ఎలా కనపడాలో కూడా తెలుసు. అంబులెన్సు నడిపినా, పాదయాత్ర చేసినా… ఏదో విధంగా మీడియాకు ఎక్కుతారు.
తాజా తనలోని కబడ్డీ క్రీడాకారిణి టాలెంట్ చూపించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. చీరకట్టులో కబడ్డీ ఆడటానికి మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. అలాంటిది.. కోతకు వెళ్లిన ఆమె.. చురుగ్గా కదిలిన తీరు అందరిని ఆశ్చర్యానికి కలుగజేయటమే కాదు.. వావ్ రోజా.. అనేలా ఆమె వ్యవహరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పురుపోరులో భాగంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు నగరి ఎమ్మెల్యే. నగరితో పాటు.. పుత్తూరు మున్సిపాలిటీలో స్థానిక నేతలతో కలిసి వీధి.. వీధి తిరుగుతూ పార్టీ తరఫు ప్రచారం చేస్తున్నారు. వైసీపీకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. నిండ్రలోని ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు.
సరదాగా అనుకున్నప్పటికి సీరియస్ గానే ఆడారు రోజా. కోతకు వెళ్లిన ఆమె.. అక్కడి విద్యార్థులకు సమానంగా ఉత్సాహంగా కదిలారు. ఓవైపు కోత పెడుతూనే..ఆటగాళ్లను అవుట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చురుగ్గా కదిలిన తీరును అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమైనా.. ఇలాంటివి ఆర్కే రోజాకు మాత్రమే సాధ్యమని స్థానికులు ప్రశంసిస్తుండటం విశేషం.
This post was last modified on March 8, 2021 1:12 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…