Political News

బాబును కాద‌న్న నోటితోనే… తత్వం బోధపడిందా?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో జ‌ట్టు క‌ట్టిన క‌మ్యూనిస్టులు.. చిత్తుగా ఓడిపోయారు. క‌నీసం ఒక్క‌స్థానంలోనూ వారు విజ‌యం సాధిం చలేక పోయారు. త‌మ‌కు ప‌ట్టున్న ప్రాంతాల‌ను కూడా పోగొట్టుకుని చేతులు కాల్చుకున్నారు. ఇక‌, 2014లోనూ వారు అప్ప‌టి స‌మైక్య ఆంధ్ర పార్టీ నేత‌, అప్ప‌టి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి పార్టీతో జ‌ట్టుక‌ట్టి ముందుకు సాగారు. అయితే.. అప్ప‌ట్లోనూ వారు విఫ‌ల‌మ‌య్యారు. అయితే.. దీనికి ముందు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీతో జ‌ట్టు క‌ట్టి ఉమ్మ‌డి ఏపీలో నాలుగు స్తానాలు కైవ‌సం చేసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. వారికి బ‌ల‌మైన‌.. న‌మ్మ‌ద‌గిన మిత్ర‌ప‌క్షం ఏదైనా ఉంటే అది టీడీపీనే అని చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ అర్ధం చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

మ‌రీముఖ్యంగా ఈ విష‌యంలో సీపీఎం కంటే.. సీపీఐ నేత‌లు ముందున్నారు. అందుకే వారు తాజాగా జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి తిరుగుతున్నారు. చాలా స్థానాల్లో టీడీపీకి మ‌ద్ద‌తిస్తూ.. మ‌రికొన్ని చోట్ల‌ వారు కూడా పోటీ చేస్తున్నారు. ఇక‌, ఎన్నిక‌ల్లోనూ సీపీఐకి టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. టీడీపీకి సీపీఐ నేత‌లు పోటీ చేస్తున్నారు. ఇటీవ‌ల కుప్పంలో చంద్ర‌బాబు ను పోలీసులు అడ్డగించిన‌ప్పుడు కూడా సీపీఐ బాగానే స్పందించింది. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి… రామ‌కృష్ణ‌.. ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని అడ్డుకుంటారా? ప‌్ర‌జాస్వామ్యం లేదా? అని నిల‌దీశారు. దీనిని బ‌ట్టి.. టీడీపీతో సీపీఐ బంధం ఏర్ప‌రుచుకుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక‌, ఇప్పుడు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ సీపీఐ బ‌లంగా ఉన్న చోట‌.. టీడీపీ ఆ స్థానాల‌ను ఆ పార్టీకే వ‌దిలేసింది. ఇలా విజ‌య‌వాడ‌లో ఆరు, విశాఖ‌లో దాదాపు ప‌ది స్థానాల‌ను, తిరుప‌తిలో నాలుగు చోట్ల సీపీఐకి టీడీపీ సపోర్టు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే బంధం వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో రెండు పార్టీల‌ను న‌మ్ముకుని చేతులు క‌లిపినా.. సీపీఐకి ఏమీ ఒరిగింది లేదు. కానీ, టీడీపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుని ముందుకు సాగినా.. ఆ పార్టీ బ‌ల‌ప‌డుతూనే ఉంది. ఇక‌, ఇప్పుడు కూడా అదే ఫార్ములాను కామ్రెడ్స్ అవ‌లంబిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. దీనికి సంబంధించి అటు టీడీపీ, ఇటు సీపీఐ అగ్ర‌నాయ‌కులు మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 7, 2021 5:02 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago