సినిమాటిక్ గా కనిపించొచ్చు. లెక్క అంటే లెక్కగా ఉండటం అన్ని చోట్ల.. అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ.. తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నం. మిగిలిన రాష్ట్రాల్లోని తీరుతో ఏ మాత్రం సంబంధం లేకుండా తమదైన పద్దతిలో టికెట్ల ఎంపికను పూర్తి చేస్తాయి. ఎక్కడి దాకానో ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ టికెట్లను ఎలా ఫైనల్ చేస్తాయో అందరికి తెలిసిందే.
అధినేత ఎవరు పేరు ఫైనల్ చేస్తే వారే పార్టీ తరఫున బరిలోకి దిగుతారు. తమిళనాడులోనూ అలాంటిదే ఉంటుంది. కానీ.. అంతకు ముందు కాస్త భిన్నమైన పద్దతిని అక్కడ అనుసరిస్తారు. పార్టీ టికెట్ కావాల్సిన వారు.. ఎవరైనా సరే పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలి. అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర సీన్ ఒకటి చోటు చేసుకుంది.
చెన్నై మహానగరంలోని చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్. ఇతడెవరంటారా? ఇంకెవరు డీఎంకే అధినేత స్టాలిన్ ముద్దుల కొడుకు. అయితే.. మాత్రం పార్టీ టికెట్ కావాలంటే డీఎంకే ఆఫీసుకు వచ్చి.. పార్టీ ఎన్నికల టీంను కలిసి.. సంప్రదాయపద్దతిలో టికెట్ కోరాలి. వారు చేసే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా స్టాలిన్ కుమారుడు సైతం ఇదే తీరిలో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి సీటును ఆశిస్తున్న కొడుకును పార్టీ నేతల ముందు ఇంటర్వ్యూ నిర్వహించారు స్టాలిన్. సీరియస్ గా కాకున్నా.. సంప్రదాయానికి అనుగుణంగాసాగిన ఇంటర్వ్యూ మొత్తాన్ని పార్టీ నేతలంతా ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మొత్తం సీన్ కాస్తంత సినిమాటిక్ గా ఉండొచ్చు. కానీ.. అధినేత ఎక్కడో రిమోట్ ప్లేస్ లో ఉండి.. ఎవరి పేరు ముందు టిక్ కొట్టి.. వారి పేరును డిసైడ్ చేసే దానితో పోలిస్తే..తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలు కొన్ని అనుసరించే ఈ విధానం కాస్త బెటర్ గా అనిపించట్లేదు?
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…