Political News

ఏపీలో ఏబీసీడీ రాజ్యం.. బాబు కామెంట్.. మేయ‌ర్ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌

ప్ర‌స్తుతం విశాఖ మ‌హాన‌గ‌రాన్ని ఏ2 అనే శ‌ని ప‌ట్టింది– అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. విశాఖ కార్పొ రేష‌న్ ప‌రిధిలో టీడీపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున రెండు రోజుల పాటు ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో తొలిరోజు.. శుక్ర‌వారం ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పెందుర్తి కూడలిలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖపట్నానికి ఏ2 శని పట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని, ఏపీలో ఏబీసీడీ రాజ్యం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏ-అవినీతి, బీ-బెదిరింపులు, సీ-క్రిమిన‌ల్, డీ-దౌర్జ‌న్య పాల‌న సాగుతోంద‌ని నిప్పులు చెరిగారు.

దాడులతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండమైన‌ విజయం అందించాలని విశాఖ వాసుల‌ను ఆయ‌న‌ కోరారు. నీతి, నిజాయితీకి విశాఖ మారు పేరు అని వ్యాఖ్యానించారు. విశాఖ అభివృద్ధికి టీడీపీ ఎంతో కష్టపడిందని చంద్రబాబు తెలిపారు. హుద్‌హుద్ సమయంలో విశాఖ కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. 22 నెలల సీఎం జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ‌ను అభివృద్ధి చేసే శ‌క్తి, సామ‌ర్థ్యం టీడీపీకే ఉన్నాయ‌ని.. చంద్ర‌బాబు చెప్పారు. త‌మ పాల‌న‌లో విశాఖ‌ను ప్ర‌పంచ ప‌టంలో పెట్టామ‌న్న చంద్ర‌బాబు.. అభివృద్ధికి మాస్ట‌ర్ ప్లాన్ కూడా రెడీ చేశామ‌ని వివ‌రించారు.

పీలాకే ప‌ట్టం..
ఇక‌, విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌త కొన్నాళ్లుగా టీడీపీలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు చంద్ర‌బాబు తెర‌దించారు. ఇక్క‌డి మేయ‌ర్ అభ్య‌ర్థిపై ప‌లువురు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిగినా.. ఈ విష‌యంలో ఎవ‌రూ కూడా ఒక నిర్ణ‌యానికి రాలేక పోయారు. తాజాగా చంద్ర‌బాబు.. పీలా శ్రీనివాస్ పేరును ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల ఆయన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీ క‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చున్న విష‌యం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి వేళ‌.. ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేసింది. దీంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు సానుభూతి పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. చంద్ర‌బాబు పీల శ్రీనివాస్ పేరును కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠానికి సిఫార్సు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 6, 2021 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రికెట్ ప్లస్ ఎండలు… దెబ్బ తగులుతోంది

మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…

32 minutes ago

మృణాల్‌నే డామినేట్ చేసిన కొత్తమ్మాయి

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…

1 hour ago

శేష్‌ను చూసి అసూయ చెందిన హీరో ఎవరు?

టాలీవుడ్లో అడివి శేష్‌ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…

2 hours ago

‘అమరావతికి’ ఎమ్మెల్యే… సాధ్యపడుతుందా?

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య దాదాపు 88 వ‌ర‌కు ఉంటుంద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవ‌ల కేంద్ర…

2 hours ago

ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన అర్చకులకు గర్భాలయంలో పూజలకు నో

విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…

4 hours ago

వేల కోట్లు ఉన్నా కష్టాన్నే నమ్ముకున్న వారసుడు

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్లలో సచిన్ ఒకరు. వేల కోట్ల ఆస్తి. ఇక అతనికి వారసుడిగా అర్జున్ హ్యాపీగా లైఫ్…

5 hours ago