Political News

వైసీపీకి ఇదంతా అవసరమా ?

అధికార వైసీపీకి ఇదంతా అవసరమా ? అనే డౌటు పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సందర్భంగా కొన్ని చోట్ల పెద్ద వివాదాలు రేగాయి. వివాదాల్లో ముఖ్యమైనది ఏమిటంటే ప్రతిపక్షాల తరపున పోటీ చేయాలని అనుకున్న కొందరు అభ్యర్ధుల సంతకాలను ఫోర్జరీలు చేసి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పటమే. పోటీకి సిద్దమైన తమ నామినేషన్లు తమకు తెలియకుండానే విత్ డ్రా అయినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించటంతో కొందరు అభ్యర్ధులు విస్తుపోయారు.

తిరుపతి కార్పొరేషన్లో 6వ డివిజన్ లో టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి, 42వ డివిజన్లో బీజేపీ అభ్యర్ధి నరసింహయాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు చెప్పారు. అయితే అధికారుల ప్రకటన విని పై ఇద్దరు అభ్యర్ధులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరు పోటికి రెడీ అయిపోయారు. కాబట్టి విత్ డ్రా అనే ముచ్చటకు అవకాశం లేదు. మరి తమకు తెలియకుండానే తమ నామినేషన్లు ఎలా విత్ డ్రా అయ్యాయని విస్తుపోయారు.

ఇదే విషయమై వాళ్ళతో పాటు వాళ్ళ పార్టీల నేతలు పెద్ద గోల చేశారు. కలెక్టర్ తో ఒకటికి పదిసార్లు మాట్లాడారు. చివరకు వీళ్ళ వాదన విన్నతర్వాత వాళ్ళ సంతకాలన్నింటినీ సరిపోల్చుకుని విత్ డ్రాయల్ తో వీళ్ళకు సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి నిర్ధారణ చేసుకున్నారు. దాంతో వాళ్ళు పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. అధికారపార్టీ నేతల ధౌర్జన్యాలకు ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి రాష్ట్రంలో ఇంకొన్ని చోట్లా జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మాచర్ల, పుంగనూరు, జమ్మలమడుగు, పులివెందుల, పిడుగురాళ్ళ లాంటి అనేక మున్సిపాలిటి వార్డుల్లో టీడీపీ తరపున కానీ లేకపోతే ఇతర పార్టీల తరపున ఒక్క నామినేషన్ కూడా పడలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలకు చేవ చచ్చిపోయిందా అనే అనుమానలు పెరిగిపోతున్నాయి. లేకపోతే వైసీపీ ధౌర్జన్యాల కారణంగానే ప్రతిపక్షాల నేతలు నామినేషన్లు వేయలేకపోయారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్నది చూస్తుంటే రెండో కారణమే నిజమనిపిస్తోంది.

ఇక్కడే అందరికీ వస్తున్న సందేహం ఏమిటంటే అధికారపార్టీ నేతలు ఇన్ని ధౌర్జన్యాలు చేయాల్సిన అవసరం ఉందా అని. ఎందుకంటే స్ధానికసంస్ధలంటేనే అధికారపార్టీకి అనుకూలంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎలాగూ తమకే గెలుచుకునే అవకాశం ఉన్నపుడు నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ? చివరకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధుల సంతకాలు కూడా ఫోర్జరీలు చేయాల్సిన అవసరం ఉందా ? అన్నదే అర్ధం కావటంలేదు.

This post was last modified on March 5, 2021 4:54 pm

Share

Recent Posts

పావలా శ్యామల ఇక లేరు

సీనియర్ సినీ నటి పావలా శ్యామల కన్నుమూశారు. 75 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్…

13 minutes ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

8 hours ago

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

10 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

10 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

12 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

12 hours ago