Political News

రీ-నామినేషన్లను బహిష్కరించిన టీడీపీ

రీ నామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కల్పించిన అవకాశాన్ని టీడీపీ ఒకచోట బహిష్కరించింది. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే సమయంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఒక్క చంద్రబాబు మాత్రమే కాకుండా ప్రతిపక్షాలన్నీ ఇలాంటి ఆరోపణలనే గుప్పించారు.

ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ అన్నింటినీ పరిశీలించారు. కలెక్టర్ల దగ్గర నుండి నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నివేదికల ఆధారంగా మూడు మున్సిపాలిటిలు, ఒక నగర పంచాయితిలో 14 వార్డుల్లో రీ-నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మూడు మున్సిపాలిటీల్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటి కూడా ఉంది. పుంగనూరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

పుంగనూరు మున్సిపాలిటిలో 31 వార్డులున్నాయి. వీటిల్లో 9, 14, 28 వార్డులకు రీ నామినేషన్ అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని టీడీపీ బహిష్కరించింది. ఇదే విషయమై నియోజకవర్గం ఇన్చార్జి అనీషారెడ్డి మాట్లాడుతూ మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని తాము కమీషన్ ను కోరినట్లు చెప్పారు. అయితే టీడీపీ ఫిర్యాదును నిమ్మగడ్డ పట్టించుకోకుండా కేవలం మూడు వార్డుల్లో మాత్రమే రీ నామినేషన్ కు అవకాశం ఇవ్వటాన్ని తప్పుపట్టారు.

ముగ్గురితో రీ నామినేషన్లు వేయించి వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టడం తమకు ఇష్టం లేదన్నారు. ఇస్తే మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని లేకపోతే తమకు ఆ అవకాశమే అవసరం లేదన్నారు. అందుకనే రీ నామినేషన్లను బహిష్కరించినట్లు అనూషారెడ్డి చెప్పారు. అయితే తిరుపతి మున్సిపాలిటిలో మూడు డవిజన్లలో టీడీపీ రీ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నది. మరి మిగిలిన మున్సిపాలిటిల్లో ఏమి చేశారనే విషయమై క్లారిటి రావాలి.

This post was last modified on March 3, 2021 4:03 pm

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

15 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

45 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago