Political News

రీ-నామినేషన్లను బహిష్కరించిన టీడీపీ

రీ నామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కల్పించిన అవకాశాన్ని టీడీపీ ఒకచోట బహిష్కరించింది. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే సమయంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఒక్క చంద్రబాబు మాత్రమే కాకుండా ప్రతిపక్షాలన్నీ ఇలాంటి ఆరోపణలనే గుప్పించారు.

ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ అన్నింటినీ పరిశీలించారు. కలెక్టర్ల దగ్గర నుండి నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నివేదికల ఆధారంగా మూడు మున్సిపాలిటిలు, ఒక నగర పంచాయితిలో 14 వార్డుల్లో రీ-నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మూడు మున్సిపాలిటీల్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటి కూడా ఉంది. పుంగనూరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

పుంగనూరు మున్సిపాలిటిలో 31 వార్డులున్నాయి. వీటిల్లో 9, 14, 28 వార్డులకు రీ నామినేషన్ అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని టీడీపీ బహిష్కరించింది. ఇదే విషయమై నియోజకవర్గం ఇన్చార్జి అనీషారెడ్డి మాట్లాడుతూ మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని తాము కమీషన్ ను కోరినట్లు చెప్పారు. అయితే టీడీపీ ఫిర్యాదును నిమ్మగడ్డ పట్టించుకోకుండా కేవలం మూడు వార్డుల్లో మాత్రమే రీ నామినేషన్ కు అవకాశం ఇవ్వటాన్ని తప్పుపట్టారు.

ముగ్గురితో రీ నామినేషన్లు వేయించి వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టడం తమకు ఇష్టం లేదన్నారు. ఇస్తే మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని లేకపోతే తమకు ఆ అవకాశమే అవసరం లేదన్నారు. అందుకనే రీ నామినేషన్లను బహిష్కరించినట్లు అనూషారెడ్డి చెప్పారు. అయితే తిరుపతి మున్సిపాలిటిలో మూడు డవిజన్లలో టీడీపీ రీ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నది. మరి మిగిలిన మున్సిపాలిటిల్లో ఏమి చేశారనే విషయమై క్లారిటి రావాలి.

Satya

Recent Posts

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

2 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

4 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

5 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

5 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

5 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

5 hours ago