Political News

రీ-నామినేషన్లను బహిష్కరించిన టీడీపీ

రీ నామినేషన్లకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కల్పించిన అవకాశాన్ని టీడీపీ ఒకచోట బహిష్కరించింది. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే సమయంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఒక్క చంద్రబాబు మాత్రమే కాకుండా ప్రతిపక్షాలన్నీ ఇలాంటి ఆరోపణలనే గుప్పించారు.

ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ అన్నింటినీ పరిశీలించారు. కలెక్టర్ల దగ్గర నుండి నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నివేదికల ఆధారంగా మూడు మున్సిపాలిటిలు, ఒక నగర పంచాయితిలో 14 వార్డుల్లో రీ-నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మూడు మున్సిపాలిటీల్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాలిటి కూడా ఉంది. పుంగనూరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

పుంగనూరు మున్సిపాలిటిలో 31 వార్డులున్నాయి. వీటిల్లో 9, 14, 28 వార్డులకు రీ నామినేషన్ అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని టీడీపీ బహిష్కరించింది. ఇదే విషయమై నియోజకవర్గం ఇన్చార్జి అనీషారెడ్డి మాట్లాడుతూ మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని తాము కమీషన్ ను కోరినట్లు చెప్పారు. అయితే టీడీపీ ఫిర్యాదును నిమ్మగడ్డ పట్టించుకోకుండా కేవలం మూడు వార్డుల్లో మాత్రమే రీ నామినేషన్ కు అవకాశం ఇవ్వటాన్ని తప్పుపట్టారు.

ముగ్గురితో రీ నామినేషన్లు వేయించి వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టడం తమకు ఇష్టం లేదన్నారు. ఇస్తే మొత్తం 31 వార్డుల్లోను రీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని లేకపోతే తమకు ఆ అవకాశమే అవసరం లేదన్నారు. అందుకనే రీ నామినేషన్లను బహిష్కరించినట్లు అనూషారెడ్డి చెప్పారు. అయితే తిరుపతి మున్సిపాలిటిలో మూడు డవిజన్లలో టీడీపీ రీ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నది. మరి మిగిలిన మున్సిపాలిటిల్లో ఏమి చేశారనే విషయమై క్లారిటి రావాలి.

This post was last modified on March 3, 2021 4:03 pm

Share
Show comments

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

40 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

1 hour ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

1 hour ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

4 hours ago