ఒకపుడు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వంటగ్యాస్ రాయితికి ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ మంగళం పాడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వంటగ్యాస్ సబ్సిడీని బాగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ రంగం సంస్ధలను తగ్గించేసి ప్రైవేటురంగానికి ప్రోత్సహం ఇవ్వాలనే అజెండాను మోడి ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మోడినే వెబినార్ ద్వారా జరిగిన సమావేశంలో చెప్పారు.
ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించటంలో భాగంగా వంటగ్యాస్ సబ్సిడీని తగ్గించేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నా మోడి ఏమాత్రం లెక్క చేయటంలేదు. ఆరేళ్ళ క్రితంతో పోల్చుకుంటే గ్యాస్ ధర ఇపుడు విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు గ్యాస్ ధర పెరిగిపోతుండటం, మరోవైపు సబ్సిడీ తగ్గిపోతుండటంతో ఆ భారమంతా వినియోగదారులపై పడుతోంది. మూడు నెలల్లో గ్యాస్ ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుత నెలలో వంటగ్యాస్ ను బుక్ చేసుకున్న వాళ్ళు చెల్లిస్తున్నది సగటు ధర రు. 816 అయితే అందుకుంటున్న సబ్సిడీ కేవలం 16 రూపాయలు మాత్రమే.
మన రాష్ట్రంలో 1.42 కోట్ల వంటగ్యాస్ కనెక్షులున్నాయి. ఇందులో సుమారు 1.15 కోట్లమంది వినియోగదారులు ప్రతినెల ఒక సిలిండర్ ను బుక్ చేసుకుంటారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఏడాదికి వినియోగదారుడిపై పడే భారం రు. 4140 కోట్లు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సబ్సిడీ ఉంటున్నా వినియోగదారులు అందుకుంటున్నది మాత్రం సగటున 16 రూపాయలు మాత్రమే. కొన్నిచోట్లయితే 4 రూపాయలు మాత్రమే సబ్సిడీ అందుతోంది.
విచిత్రమేమిటంటే మోడి సర్కార్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, మధ్య తరగతి జనాలందుకుంటున్న సబ్సిడీ ఒకటే. సంపన్నకుటుంబాల వాళ్ళు గ్యాస్ సబ్సిడీని స్వచ్చంధంగా వదులుకోమని అప్పట్లో కేంద్రప్రభుత్వం ఒక పిలుపిచ్చింది. ఆ పిలుపుకు ఎంతమంది సంపన్నులు స్పందించారో తెలీదు. మొత్తానికి తొందరలోనే వంటగ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
This post was last modified on March 1, 2021 11:08 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…