ఒకపుడు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వంటగ్యాస్ రాయితికి ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ మంగళం పాడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వంటగ్యాస్ సబ్సిడీని బాగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ రంగం సంస్ధలను తగ్గించేసి ప్రైవేటురంగానికి ప్రోత్సహం ఇవ్వాలనే అజెండాను మోడి ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మోడినే వెబినార్ ద్వారా జరిగిన సమావేశంలో చెప్పారు.
ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించటంలో భాగంగా వంటగ్యాస్ సబ్సిడీని తగ్గించేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నా మోడి ఏమాత్రం లెక్క చేయటంలేదు. ఆరేళ్ళ క్రితంతో పోల్చుకుంటే గ్యాస్ ధర ఇపుడు విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు గ్యాస్ ధర పెరిగిపోతుండటం, మరోవైపు సబ్సిడీ తగ్గిపోతుండటంతో ఆ భారమంతా వినియోగదారులపై పడుతోంది. మూడు నెలల్లో గ్యాస్ ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుత నెలలో వంటగ్యాస్ ను బుక్ చేసుకున్న వాళ్ళు చెల్లిస్తున్నది సగటు ధర రు. 816 అయితే అందుకుంటున్న సబ్సిడీ కేవలం 16 రూపాయలు మాత్రమే.
మన రాష్ట్రంలో 1.42 కోట్ల వంటగ్యాస్ కనెక్షులున్నాయి. ఇందులో సుమారు 1.15 కోట్లమంది వినియోగదారులు ప్రతినెల ఒక సిలిండర్ ను బుక్ చేసుకుంటారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఏడాదికి వినియోగదారుడిపై పడే భారం రు. 4140 కోట్లు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సబ్సిడీ ఉంటున్నా వినియోగదారులు అందుకుంటున్నది మాత్రం సగటున 16 రూపాయలు మాత్రమే. కొన్నిచోట్లయితే 4 రూపాయలు మాత్రమే సబ్సిడీ అందుతోంది.
విచిత్రమేమిటంటే మోడి సర్కార్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, మధ్య తరగతి జనాలందుకుంటున్న సబ్సిడీ ఒకటే. సంపన్నకుటుంబాల వాళ్ళు గ్యాస్ సబ్సిడీని స్వచ్చంధంగా వదులుకోమని అప్పట్లో కేంద్రప్రభుత్వం ఒక పిలుపిచ్చింది. ఆ పిలుపుకు ఎంతమంది సంపన్నులు స్పందించారో తెలీదు. మొత్తానికి తొందరలోనే వంటగ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
This post was last modified on March 1, 2021 11:08 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…