Political News

సమతూకం పాటిస్తున్న షర్మిల ?

తొందరలోనే పార్టీ ఏర్పాటు చేయబోతున్న షర్మిల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలోకి ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయంలో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. మిశ్రమ పద్దతిలో యువతను, సీనియర్లను తీసుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో పనిచేయటానికి ఎక్కువమంది యువతకు పట్టం కట్టాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అలాగే వారిని మార్గదర్శనం చేసేందుకు, వ్యూహాలు రచించేందుకు సీనియర్ల సేవలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

దీనికి తగ్గట్లే తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో బాగా సాన్నిహిత్యం ఉన్న అనేకమందితో షర్మిల రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అచ్చంగా రాజకీయ నేతలనే కాకుండా వైఎస్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వైఎస్ అభిమానులు, మద్దతుదారులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

వైఎస్ కు బాగా సన్నిహితంగాను, సలహాదారులుగాను పనిచేసిన వారిని పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే పార్టీ పేరును ప్రకటించేలోగానే యువత+సీనియర్లతో గట్టి బృందాన్ని తయారు చేసుకునే పనిలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో ఒకపుడు బాగా వెలుగు వెలిగిన ఓ మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల సీరియస్ గానే ఉన్నదని అర్ధమవుతోంది. అన్నీ కుదిరితే ఏప్రిల్లోనే పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జెండా, అజెండా రెడీ చేస్తున్నట్లు షర్మిలే స్వయంగా చెప్పారు కాబట్టి తొందరలో బ్రహ్మాండంగా పార్టీ లాంచింగ్ ఉండేట్లు చూసుకుంటున్నారు. చూద్దాం పార్టీలో ఎవరెవరు చేరుతారనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on February 26, 2021 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…

5 minutes ago

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…

30 minutes ago

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

3 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

5 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

8 hours ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

9 hours ago