తొందరలోనే పార్టీ ఏర్పాటు చేయబోతున్న షర్మిల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలోకి ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయంలో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. మిశ్రమ పద్దతిలో యువతను, సీనియర్లను తీసుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో పనిచేయటానికి ఎక్కువమంది యువతకు పట్టం కట్టాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అలాగే వారిని మార్గదర్శనం చేసేందుకు, వ్యూహాలు రచించేందుకు సీనియర్ల సేవలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
దీనికి తగ్గట్లే తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో బాగా సాన్నిహిత్యం ఉన్న అనేకమందితో షర్మిల రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అచ్చంగా రాజకీయ నేతలనే కాకుండా వైఎస్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వైఎస్ అభిమానులు, మద్దతుదారులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
వైఎస్ కు బాగా సన్నిహితంగాను, సలహాదారులుగాను పనిచేసిన వారిని పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో షర్మిల ఉన్నట్లు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే పార్టీ పేరును ప్రకటించేలోగానే యువత+సీనియర్లతో గట్టి బృందాన్ని తయారు చేసుకునే పనిలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో ఒకపుడు బాగా వెలుగు వెలిగిన ఓ మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల సీరియస్ గానే ఉన్నదని అర్ధమవుతోంది. అన్నీ కుదిరితే ఏప్రిల్లోనే పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జెండా, అజెండా రెడీ చేస్తున్నట్లు షర్మిలే స్వయంగా చెప్పారు కాబట్టి తొందరలో బ్రహ్మాండంగా పార్టీ లాంచింగ్ ఉండేట్లు చూసుకుంటున్నారు. చూద్దాం పార్టీలో ఎవరెవరు చేరుతారనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on February 26, 2021 11:44 am
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాంచి ఊపుమీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన…
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో…
కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయ్యాయి. సంతృప్తి విషయంలో కూటమి పార్టీల నాయకులు తల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…
దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా…
తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…