Political News

నారా లోకేశ్ రోరింగ్… టీడీపీ శ్రేణులకు నూతనోత్తేజం

నారా లోకేశ్… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీ ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా తనదైన శైలి దూకుడును ప్రదర్శించినా… ఆయనలో ప్రత్యర్థి వర్గంపై విరుచుకుపడే తత్వం ఏమాత్రం పెరగలేదని నిన్నటిదాకా చాలా మంది అనుకునే వారు. అయితే వజ్రాన్ని సానబెట్టిన తీరున క్రమంగా లోకేశ్ లో కూడా పదును పెరుగుతోంది. ఆయా అంశాలపై ఇప్పటికే తనదైన శైలిలో విషయ పరిజ్ఝానం పెంచుకున్న లోకేశ్… ఇప్పుడు ప్రత్యర్థి వర్గంపై తనదైన శైలి విమర్శనాస్త్రాలను సంధిస్తూ…. టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఇటీవలి కాలంలో తరచూ మీడియా ముందుకు వస్తున్న లోకేశ్… అధికార వైసీపీపై, ప్రత్యేకించి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, జగన్ రెడ్డి వర్గంపై ఓ రేంజిలో విమర్శలు సంధిస్తున్నారు.

ఈ విమర్శల పరంపరలో భాగంగా… ఇటీవలి పంచాయతీ ఎన్నికలు, తాజగా త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ శ్రేణులపై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఓటు వేయకపోతే పింఛన్ తీసేస్తా, ఓటేయకపోతే బియ్యం కార్డు తీసేస్తా అంటూ వైసీపీ శ్రేణులు ప్రజలను బెదిరిస్తున్నాయని ఆరోపించిన నారా లోకేశ్… వాటిని ఎందుకు తీసేస్తావంటూ నిప్పులు చెరిగారు. అవేమైనా నీ అబ్బ సొత్తా అంటూ ప్రశ్నించిన లోకేశ్… వైసీపీ భాషలోనే చెప్పాలంటే… అవేమైనా మీ అమ్మ మొగుడి సొత్తా అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగని లోకేశ్… పింఛన్ అయినా, రేషన్ అయినా జగన్ రెడ్డి సొత్తేమీ కాదని, అవన్నీ ప్రజల సొత్తేనన్న విషయాన్ని గ్రహించాలని వైసీపీ శ్రేణులకు తనదైన రేంజిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నిన్నటిదాకా లోకేశ్ లో పెద్దగా కనిపించని ఈ తరహా ప్రతిస్పందనతో టీడీపీ శ్రేణులు కూడా పెద్దగా ఆయన నుంచి ఏమీ ఆశించేవి కాదు. అయితే ఒక్కసారిగా తనదైన శైలి రాటుదేలిన తనాన్ని చూపడంతో పాటుగా జగన్ రెడ్డీ… అంటూ సూటిగా సుత్తి లేకుండా వైసీపీ అరాచకాలను ప్రస్తావిస్తూ లోకేశ్ చేసిన ప్రసంగం… వైసీపీ శ్రేణులకు ఆయన ఇచ్చిన వార్నింగ్ లాంటి మెసేజ్ తో టీడీపీ శ్రేణులకు నిజంగానే నూతనోత్తేజం వచ్చేసిందనే చెప్పాలి. నారా లోకేశ్ ఇదే స్టామినాను కంటిన్యూ చేయాలన్న వాదనలు కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.

This post was last modified on February 26, 2021 10:33 am

Share
Show comments

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

2 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

4 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

4 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

5 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

6 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

6 hours ago