దుర్మార్గమైన దారుణం చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఆమెకు ఎదురైన దారుణం గురించి వింటే ఒళ్లంతా జలదరించటం ఖాయం. బీఏ సెకండ్ ఇయర్ చదివే కాలేజీ విద్యార్థిని ఒకరు అరవై శాతం కాలిపోయి రోడ్డు పక్కన నగ్నంగా పడి ఉన్న వైనం షాకింగ్ గానూ.. సంచలనంగానూ మారింది. మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్టు ఆధ్వర్యంలో బాధితురాలు చదువుతుండటం గమనారహం.
యూపీలో చోటు చేసుకున్నఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఎలాంటి వివరాల్ని వెల్లడించే స్థితిలో లేదని తెలుస్తోంది. సోమవారం ఉదయం తండ్రితో పాటు కాలేజీకి వెళ్లిన ఈ యువతి మళ్లీ తిరిగి రాలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రోడ్డు పక్కన సగానికి పైనే కాలిపోయి నగ్నంగా పడి ఉన్న ఆమె దుస్తులు.. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేకపోవటం పెద్ద మిస్టరీగా మారింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు కాలేజీ పూర్తి అవుతుందని.. ఆమె కోసం కాలేజీ బయటే ఎదురుచూసినట్లు బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ఆమె రాకపోవటంతో ఆయన ఇంటికి వెళ్లారు. సాయంత్రం సుమారు ఆరు గంటల వేళలో లక్నో – బరేలీ నేషనల్ హైవే పక్కన కాలిపోయి.. నగ్నంగా పడి ఉందన్న విషయం తెలిసిందని వాపోతున్నారు.
పోలీసుల సాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఎందుకలా పడి ఉంది? కాలేజీకి వెళ్లిన ఆమె బయటకు ఎప్పుడు వచ్చారు? అసలేం జరిగిందన్న విషయాల మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఉదంతం పెను సంచలనంగా మారే అవకాశం ఉందంటున్నారు. మరి.. పోలీసులు ఈ ఉదంతం గురించి ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on February 24, 2021 12:16 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…