Political News

పరిషత్ ఎన్నికలు జనసేనకు ఇష్టం లేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన సంవత్సరంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన కోర్టులో పిటీషన్ వేసింది. ఈ మేరకు పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతు పోయిన ఏడాది జరిగిన పరిషత్ ఎన్నికలు ధౌర్జన్యాలు, బెదిరింపులతో ఏకపక్షం చేసుకున్నట్లు చెప్పారు. అందుకనే అప్పటి ఎన్నికల ప్రక్రియను నూరుశాతం రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.

నాదెండ్ల మనోహర్ డిమాండ్ బాగానే ఉంది కానీ కానీ అది ఆచరణలో సాధ్యంకాదు. ఎందుకంటే అప్పటి ఎన్నికల ప్రక్రియలో సుమారు 24 శాతం వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలయ్యాయి. అలాగే మరికొన్ని చోట్ల ఏక పక్షంగా గెలిచారు. ఇలాంటి చోట్ల చాలావాటిలో రిటర్నింగ్ అధికారులు వాళ్ళ గెలుపును ప్రకటించేశారు. ఇదే విషయమై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆ విజయాలను ధృవీకరించిన విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా పరిషత్ ఎన్నికల విషయమై నిమ్మగడ్డ మాట్లాడుతు మళ్ళీ ఫ్రెష్ గా పరిషత్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. దానిపై వైసీపీ కోర్టుకెక్కింది. కేసును విచారించిన న్యాయస్ధానం గెలుపును రిటర్నింగ్ అధికారులు ప్రకటించేసిన తర్వాత దాన్ని రద్దుచేసే అధికారం ఎలక్షన్ కమీషన్ కు లేదని తేల్చి చెప్పింది. ఎక్కడైనా ప్రకటించకపోతే వాటి విషయాన్ని పరిశీలించాలని చెప్పింది.

నిమ్మగడ్డ వాదననే కోర్టు కొట్టేసినపుడు మళ్ళీ అదే వాదనతో జనసేన కోర్టులో కేసు వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఈ విషయం తెలిసికూడా కేసు వేసిందంటే పరిషత్ ఎన్నికలు జరగటం జనసేనకు ఇష్టం లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కోర్టులో ఇదే విషయమై ఎన్నిరోజులు విచారణ జరిగినా చివరకు పాత తీర్పును కోర్టు మళ్ళీ కొత్తగా ఇస్తుందంతే. ఈ మాత్రం దానికి విలువైన సమయం వృధా అవటం తప్ప మరేమీలేదు.

This post was last modified on February 24, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

44 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago