Political News

కాపులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.. ప‌వ‌న్ దే లేటు!!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. త‌న‌కు కులాల‌ను అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరావేశంలో చెప్పుకొచ్చారు. తాను అభినవ రాజ‌కీయ నేత‌న‌ని.. త‌న‌కు ఏ కుల‌మూ.. మ‌త‌మూ లేద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. త‌న‌ను కులం అనే రాట‌కు క‌ట్టేస్తారా?  ఇంత సంకుచితంగా చూస్తారా? అంటూ.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న ఏ కులం వ‌ద్దు.. త‌న‌కు ఏ రంగు పూయ‌వ‌ద్దు.. అన్నారో.. అదే కులం ఆయ‌న‌ను నెత్తిన పెట్టుకుంది. అదేసామాజిక వ‌ర్గం.. ఆయ‌న పార్టీని భుజాల‌పైకి ఎక్కించుకుంది.

ఔను! ఇప్పుడు కాపు సామాజిక వ‌ర్గం జ‌న‌సేన ప‌రువును నిల‌బెట్టింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నిలిచి.. ప‌రువును నిల‌బెట్టుకుందంటే.. కేవ‌లం కాపు సామాజిక వ‌ర్గం అండ‌తోనే! ఇది నిర్వివాదాంశం. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కాపులు ఎక్కువ‌గా ఉన్న తూర్పు గోదావ‌రిలో తాజాగా త‌న పార్టీమ‌ద్ద‌తు దారులుగా గెలిచిన వారికి స‌న్మానాలు చేయ‌డ‌మే! అంటే.. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్ ఎంత కాద‌నుకున్నా.. కాపులే ఇప్పుడు అండగా నిలిచార‌ని ప‌రోక్షంగా అంగీక‌రించ‌డ‌మే!!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లోని కాపు సామాజిక వ‌ర్గం రెండో మాట లేకుండా జ‌న‌సేన వైపు నిల‌బ‌డింది. నిజానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జన‌సేన పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. అయిన‌ప్ప‌టికీ.. నెల్లూరు స‌హా ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లోని చాలా పంచాయ‌తీల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు.  నాలుగు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. జ‌న‌సేన అభ్య‌ర్థులను గెలిపించింది కేవ‌లం కాపు సామాజిక వ‌ర్గమే కావ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో కాపుల‌ను ఇప్ప‌టికైనా సంపూర్ణంగా ఓన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్‌కు ఏర్ప‌డింది. అంతేకాదు.. ప‌వ‌న్ ఇప్పుడు ట‌ర్న్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.  గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు కాపులు క్లారిటీ ఇచ్చారు.  టీడీపీని ఒక‌ప్పుడు విశ్వ‌సించి ప‌ట్ట‌గ‌ట్టిన కాపులు.. తూర్పులో ఇప్పుడు జ‌న‌సేన‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అదేవిధంగా.. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించిన కాపులు ఇప్పుడు స్థానికంలో వ‌చ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి.. ఆపార్టీని కూడా దూరం పెట్టార‌నిస్ప‌ష్ట‌మ‌వుతోంది. సో.. ఏతావాతా ఎలా చూసుకున్నా.. కాపులు జ‌న‌సేన వైపు నిల‌బ‌డ్డారు. మ‌రి ప‌వ‌న్ వారివైపు నిల‌బ‌డ‌తారా?  లేదా?  చూడాలి ఏం జ‌రుగుతుందో.

This post was last modified on February 23, 2021 1:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

నీల్ తప్ప ఎవరూ చెప్పలేని గుట్టు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…

1 hour ago

మరో బాహుబలి.. ట్రెండ్ సెట్ చేస్తుందా

కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…

1 hour ago

గుడ్డు-మ‌ట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!

మాట‌ల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. త‌మ వ్యం గ్యాస్త్రాలు,…

2 hours ago

సమ్మర్ హీట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్

ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు  జారీచేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్‌,…

3 hours ago

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

11 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

12 hours ago