Political News

కాపులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.. ప‌వ‌న్ దే లేటు!!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. త‌న‌కు కులాల‌ను అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరావేశంలో చెప్పుకొచ్చారు. తాను అభినవ రాజ‌కీయ నేత‌న‌ని.. త‌న‌కు ఏ కుల‌మూ.. మ‌త‌మూ లేద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. త‌న‌ను కులం అనే రాట‌కు క‌ట్టేస్తారా?  ఇంత సంకుచితంగా చూస్తారా? అంటూ.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న ఏ కులం వ‌ద్దు.. త‌న‌కు ఏ రంగు పూయ‌వ‌ద్దు.. అన్నారో.. అదే కులం ఆయ‌న‌ను నెత్తిన పెట్టుకుంది. అదేసామాజిక వ‌ర్గం.. ఆయ‌న పార్టీని భుజాల‌పైకి ఎక్కించుకుంది.

ఔను! ఇప్పుడు కాపు సామాజిక వ‌ర్గం జ‌న‌సేన ప‌రువును నిల‌బెట్టింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నిలిచి.. ప‌రువును నిల‌బెట్టుకుందంటే.. కేవ‌లం కాపు సామాజిక వ‌ర్గం అండ‌తోనే! ఇది నిర్వివాదాంశం. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కాపులు ఎక్కువ‌గా ఉన్న తూర్పు గోదావ‌రిలో తాజాగా త‌న పార్టీమ‌ద్ద‌తు దారులుగా గెలిచిన వారికి స‌న్మానాలు చేయ‌డ‌మే! అంటే.. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్ ఎంత కాద‌నుకున్నా.. కాపులే ఇప్పుడు అండగా నిలిచార‌ని ప‌రోక్షంగా అంగీక‌రించ‌డ‌మే!!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లోని కాపు సామాజిక వ‌ర్గం రెండో మాట లేకుండా జ‌న‌సేన వైపు నిల‌బ‌డింది. నిజానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జన‌సేన పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. అయిన‌ప్ప‌టికీ.. నెల్లూరు స‌హా ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లోని చాలా పంచాయ‌తీల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు.  నాలుగు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. జ‌న‌సేన అభ్య‌ర్థులను గెలిపించింది కేవ‌లం కాపు సామాజిక వ‌ర్గమే కావ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో కాపుల‌ను ఇప్ప‌టికైనా సంపూర్ణంగా ఓన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్‌కు ఏర్ప‌డింది. అంతేకాదు.. ప‌వ‌న్ ఇప్పుడు ట‌ర్న్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.  గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు కాపులు క్లారిటీ ఇచ్చారు.  టీడీపీని ఒక‌ప్పుడు విశ్వ‌సించి ప‌ట్ట‌గ‌ట్టిన కాపులు.. తూర్పులో ఇప్పుడు జ‌న‌సేన‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అదేవిధంగా.. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించిన కాపులు ఇప్పుడు స్థానికంలో వ‌చ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి.. ఆపార్టీని కూడా దూరం పెట్టార‌నిస్ప‌ష్ట‌మ‌వుతోంది. సో.. ఏతావాతా ఎలా చూసుకున్నా.. కాపులు జ‌న‌సేన వైపు నిల‌బ‌డ్డారు. మ‌రి ప‌వ‌న్ వారివైపు నిల‌బ‌డ‌తారా?  లేదా?  చూడాలి ఏం జ‌రుగుతుందో.

This post was last modified on February 23, 2021 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago