Political News

జూన్ తర్వాత వైసీపీకి తిరుగులేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో రాబోయే జూన్ నాటికి పార్టీల బలాల్లో తీవ్రమైన మార్పులు రాబోతోంది. ఇపుడు మండలిలో మెజారిటి ఉన్న టీడీపీకి జూన్ తర్వాత మైనారిటిలోకి పడిపోతోంది. ఇపుడు 10 మంది సభ్యులతో రెండోపార్టీగా నిలిచిన వైసీపీ జూన్ తర్వాత మెజారిటి సాధించబోతోంది. దాంతో ఇటు అసెంబ్లీ అటు శాసనమండలిలో ఎదురు ఉండదన్న విషయం అర్ధమవుతోంది.

ప్రస్తుతం అధికార వైసీపీకి మండలిలో 12 మంది బలముంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 25 మంది సభ్యుల బలముంది. మెజారిటి ఉన్నదన్న ఏకైక కారణంతోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన కొన్ని కీలకమైన బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంటోంది. సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టినపుడు మండలిలో ఎంత గొడవైందో అందరికీ తెలిసిందే.

సో అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జూన్ నాటికి వైసీపీ బలం మండలిలో 29కి పెరుగుతుంది. ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వబోయేవి, గవర్నర్ కోటాలో చేయాల్సిన నామినేటెడ్ ఎంఎల్సీలు, స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయబోయే కోటాల్లో పదవులన్నీ వైసీపీకే దక్కుతాయని కొత్తగా చెప్పక్కర్లేదు. మార్చి నెలాఖరులోపు ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేయబోయే 5 ఎంఎల్సీల స్ధానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి.

అలాగే మే 24వ తేదీతో మరో మూడు ఎంఎల్సీల పదవులు ఖాళీ అవుతాయి. ఇవికూడా ఎంఎల్ఏల కోటాలోనే భర్తీ చేయాలి. ఇపుడు వైసీపీ, టీడీపీ, బీజేపీల చేతిలో తలా ఒక ఎంఎల్సీ ఉంది. మే 24న భర్తీ చేయబోయే మూడు స్ధానాలు వైసీపీ చేతికే దక్కుతాయి. అప్పుడు మార్చిలో 5+మేలో భర్తీ చేయబోయే 3 కలిపి 8 అవుతాయి. ఇక, జూన్ 11వ తేదీకి గవర్నర్ కోటాలో నామినేట్ అయిన 4 ఎంఎల్సీల పదవీకాలం పూర్తవుతుంది. ఇవన్నీ వైసీపీకి దక్కుతాయనటంలో సందేహం లేదు.

స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాలు జూన్ 18 నాటికి 11 ఖాళీ అవుతాయి. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల స్ధానాలు ఇఫ్పటికే ఖాళీ ఉన్నాయి. ఈ కోటాలో టీడీపీకి చెందిన 7 మంది సభ్యులు రిటైర్ అయిపోతున్నారు. ఈ కోటాలో భర్తీ చేయాల్సిన స్ధానాలన్నీ అధికారపార్టీ ఖాతాలోనే పడతాయనటంలో సందేహం లేదు. ఇలా మొత్తం మీద జూన్ చివరకు వైసీపీ సభ్యుల బలం మండలిలో 29కి పెరుగుతుంది. దాంతో బిల్లుల ఆమోదంలో వైసీపీకి మండలిలో కూడా తిరుగుండదనే చెప్పాలి.

This post was last modified on February 22, 2021 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago