Political News

టీడీపీలో సామంతరాజులెవరబ్బా ?

విజయవాడలో నేతల వర్గపోరు బాగా పెరిగిపోతోంది. విజయవాడ ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా ఓడిపోయిన వారు సామంతరాజుల్లాగ ఫీలైపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తాను పర్యటించాలంటే ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ? అంటూ తీవ్రంగా మండిపోయారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఎవరు ? సామంతరాజుల్లాగ ఫీలైపోతున్న వారెవరు ? అనే విషయాలను మాత్రం కేశినేని చెప్పలేదు.

ఎంపిగా గెలిచిన తాను ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని అనటమే విచిత్రంగా ఉందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండే ఎంపికి, అప్పటి మంత్రి దేవినేని ఉమకు ఏమాత్రం పడేది కాదని పార్టీలోనే ప్రచారంలో ఉంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటం, దేవినేని కూడా ఓడిపోయారు. ఇదే సమయంలో ఎంపిగా పోటీ చేసిన కేశినేని గెలిచారు. దాంతో తన ఓటమికి ఎంపినే కారణమని దేవినేని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారట.

ఇదే సమయంలో తన ఓటమికి దేవినేని తీవ్రంగా ప్రయత్నించారని అయితే దాన్ని తాను గుర్తించి మేల్కొనటం వల్లే అతికొద్ది మార్జిన్ తో అయినా గెలవగలిగినట్లు ఎంపి కూడా ఫిర్యాదు చేశారట. వీళ్ళద్దరి మధ్య పంచాయితి చేయటం కుదరక చంద్రబాబు ఇద్దరి ఫిర్యాదులను పక్కన పడేశారు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరినీ కంట్రోల్ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదు. దాంతో విజయవాడలో పార్టీ నేతలు ఇద్దరి మధ్య చీలిపోయారు. దాంతో రెండు వర్గాలు ఒకదానిపై మరొక వర్గం ప్రతిరోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటునే ఉన్నాయి.

ఇపుడా అంతర్గత విభేదాలు పెరిగి చివరకు రోడ్డుమీద పడిపోయాయి. ఈ గొడవల విషయంపైనే రెండు రోజులుగా ఎంపి రెచ్చిపోయి ప్రత్యర్ధివర్గంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ గెలిచిన నేను తీసుకోవటం ఏమిటంటూ మండిపోతున్నారు. తనకున్న ప్రజాబలంతోనే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తానంటూ చాలెంజ్ చేశారు. మొత్తానికి ఏ ఒక్కరినీ పేరుపెట్టి నేరుగా మాట్లాడకపోయినా, ఆరోపణలు చేయకపోయినా తగలాల్సిన వారికి కచ్చితంగా తగిలే ఉంటుందనటంలో సందేహం లేదు.

This post was last modified on February 19, 2021 7:24 pm

Share
Show comments

Recent Posts

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

8 mins ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

55 mins ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

2 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

2 hours ago

మెగా సస్పెన్స్.! తమ్ముడ్ని గెలిపిస్తే, చెల్లెల్ని ఓడించినట్టేగా.!

‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…

4 hours ago

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

4 hours ago