విజయవాడలో నేతల వర్గపోరు బాగా పెరిగిపోతోంది. విజయవాడ ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా ఓడిపోయిన వారు సామంతరాజుల్లాగ ఫీలైపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తాను పర్యటించాలంటే ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ? అంటూ తీవ్రంగా మండిపోయారు. అయితే ఓడిపోయిన వాళ్ళు ఎవరు ? సామంతరాజుల్లాగ ఫీలైపోతున్న వారెవరు ? అనే విషయాలను మాత్రం కేశినేని చెప్పలేదు.
ఎంపిగా గెలిచిన తాను ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని అనటమే విచిత్రంగా ఉందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండే ఎంపికి, అప్పటి మంత్రి దేవినేని ఉమకు ఏమాత్రం పడేది కాదని పార్టీలోనే ప్రచారంలో ఉంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటం, దేవినేని కూడా ఓడిపోయారు. ఇదే సమయంలో ఎంపిగా పోటీ చేసిన కేశినేని గెలిచారు. దాంతో తన ఓటమికి ఎంపినే కారణమని దేవినేని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారట.
ఇదే సమయంలో తన ఓటమికి దేవినేని తీవ్రంగా ప్రయత్నించారని అయితే దాన్ని తాను గుర్తించి మేల్కొనటం వల్లే అతికొద్ది మార్జిన్ తో అయినా గెలవగలిగినట్లు ఎంపి కూడా ఫిర్యాదు చేశారట. వీళ్ళద్దరి మధ్య పంచాయితి చేయటం కుదరక చంద్రబాబు ఇద్దరి ఫిర్యాదులను పక్కన పడేశారు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరినీ కంట్రోల్ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదు. దాంతో విజయవాడలో పార్టీ నేతలు ఇద్దరి మధ్య చీలిపోయారు. దాంతో రెండు వర్గాలు ఒకదానిపై మరొక వర్గం ప్రతిరోజు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటునే ఉన్నాయి.
ఇపుడా అంతర్గత విభేదాలు పెరిగి చివరకు రోడ్డుమీద పడిపోయాయి. ఈ గొడవల విషయంపైనే రెండు రోజులుగా ఎంపి రెచ్చిపోయి ప్రత్యర్ధివర్గంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళ పర్మిషన్ గెలిచిన నేను తీసుకోవటం ఏమిటంటూ మండిపోతున్నారు. తనకున్న ప్రజాబలంతోనే పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తానంటూ చాలెంజ్ చేశారు. మొత్తానికి ఏ ఒక్కరినీ పేరుపెట్టి నేరుగా మాట్లాడకపోయినా, ఆరోపణలు చేయకపోయినా తగలాల్సిన వారికి కచ్చితంగా తగిలే ఉంటుందనటంలో సందేహం లేదు.
This post was last modified on February 19, 2021 7:24 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…