Political News

తిరుప‌తిపై చింత మోహ‌న్ ఎఫెక్ట్‌.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావ‌డం, వ‌రుస‌గా దీనిని గెలుచుకుంటూ ఉండ‌డం(2014, 2019)తో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లోనూ దీనిని కైవ‌సం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించుకుంది.

ఇక‌, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి ప‌ట్టుబ‌డుతోంది. అయితే.. ఈ పార్టీల మ‌ద్య టికెట్ వివాదం కొత్త మ‌లుపులు తిరుగుతుండ‌డంతో ఇది తేల‌డం.. పార్టీల త‌ర‌పున ప్ర‌చారం జ‌ర‌గ‌డం అనేది ఒకింత లేట‌య్యే అవ‌కాశం ఉంది. ఇక‌, అప్ప‌టికి వైసీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌, టీడీపీ త‌ర‌పున ఇప్ప‌టికే బ‌రిలో నిలిచిన ప‌న‌బాక ల‌క్ష్మి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌లు మ‌ళ్లీ రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనేది సందేహం. ఇదిలావుంటే.. లైవ్‌లో దూకుడుగా ఉన్న పార్టీల కంటే.. కూడా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా టాక్ లేని కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది మొద‌లైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై వైసీపీ‌లోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ జోరుగా సాగుతోంది.

పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ చింతా మోహ‌న్‌.. వైసీపీని ఇటీవ‌ల కాలంలో భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్‌ను, వైఎస్ కుటుంబాన్ని.. ఆయ‌న వ్య‌వ‌హారాన్ని ఆయ‌న టార్గెట్ చేస్తున్న తీరు.. మేధావుల‌ను సైతం ఆలోచింప‌చేస్తోంది.

జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాద‌ని.. ఆయ‌న వేస్ట్ అని చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తీవ్ర ‌ప్ర‌చారానికి వ‌చ్చాయి. ఆయ‌న ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు కూడా కాంగ్రెస్‌ని కాపీ కొట్టిన‌వేన‌ని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నార‌ని.. ఇలా చింతా మోహ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. మొద‌ట్లో వీటిని లైట్ తీసుకున్న వైసీపీ.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో చింతా మోహ‌న్‌కు ఉన్న బ‌లం నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయ‌నే భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. కొత్త స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులు అనుకుంటున్నారు.
పైగా ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌డుతోంది. మ‌రోవైపు తిరుప‌తి అభివృద్ది త‌మ‌దేన‌ని చెబుతోంది. ఇలా అటు వ్య‌క్తిగ‌తంగా ఇటు పాల‌న ప‌రంగా కూడా వైసీపీ తిరుప‌తిలో టార్గెట్ అవుతుండ‌డంతో రేపు ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 19, 2021 7:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

52 minutes ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

59 minutes ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

1 hour ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

2 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

3 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

5 hours ago