Political News

తిరుప‌తిపై చింత మోహ‌న్ ఎఫెక్ట్‌.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావ‌డం, వ‌రుస‌గా దీనిని గెలుచుకుంటూ ఉండ‌డం(2014, 2019)తో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లోనూ దీనిని కైవ‌సం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించుకుంది.

ఇక‌, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి ప‌ట్టుబ‌డుతోంది. అయితే.. ఈ పార్టీల మ‌ద్య టికెట్ వివాదం కొత్త మ‌లుపులు తిరుగుతుండ‌డంతో ఇది తేల‌డం.. పార్టీల త‌ర‌పున ప్ర‌చారం జ‌ర‌గ‌డం అనేది ఒకింత లేట‌య్యే అవ‌కాశం ఉంది. ఇక‌, అప్ప‌టికి వైసీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌, టీడీపీ త‌ర‌పున ఇప్ప‌టికే బ‌రిలో నిలిచిన ప‌న‌బాక ల‌క్ష్మి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌లు మ‌ళ్లీ రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనేది సందేహం. ఇదిలావుంటే.. లైవ్‌లో దూకుడుగా ఉన్న పార్టీల కంటే.. కూడా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా టాక్ లేని కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది మొద‌లైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై వైసీపీ‌లోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ జోరుగా సాగుతోంది.

పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ చింతా మోహ‌న్‌.. వైసీపీని ఇటీవ‌ల కాలంలో భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్‌ను, వైఎస్ కుటుంబాన్ని.. ఆయ‌న వ్య‌వ‌హారాన్ని ఆయ‌న టార్గెట్ చేస్తున్న తీరు.. మేధావుల‌ను సైతం ఆలోచింప‌చేస్తోంది.

జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాద‌ని.. ఆయ‌న వేస్ట్ అని చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తీవ్ర ‌ప్ర‌చారానికి వ‌చ్చాయి. ఆయ‌న ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు కూడా కాంగ్రెస్‌ని కాపీ కొట్టిన‌వేన‌ని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నార‌ని.. ఇలా చింతా మోహ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. మొద‌ట్లో వీటిని లైట్ తీసుకున్న వైసీపీ.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో చింతా మోహ‌న్‌కు ఉన్న బ‌లం నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయ‌నే భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. కొత్త స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులు అనుకుంటున్నారు.
పైగా ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌డుతోంది. మ‌రోవైపు తిరుప‌తి అభివృద్ది త‌మ‌దేన‌ని చెబుతోంది. ఇలా అటు వ్య‌క్తిగ‌తంగా ఇటు పాల‌న ప‌రంగా కూడా వైసీపీ తిరుప‌తిలో టార్గెట్ అవుతుండ‌డంతో రేపు ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

27 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

4 hours ago