తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావడం, వరుసగా దీనిని గెలుచుకుంటూ ఉండడం(2014, 2019)తో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలోనూ దీనిని కైవసం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించుకుంది.
ఇక, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జనసేనల కూటమి పట్టుబడుతోంది. అయితే.. ఈ పార్టీల మద్య టికెట్ వివాదం కొత్త మలుపులు తిరుగుతుండడంతో ఇది తేలడం.. పార్టీల తరపున ప్రచారం జరగడం అనేది ఒకింత లేటయ్యే అవకాశం ఉంది. ఇక, అప్పటికి వైసీపీ పుంజుకోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు.
ఇక, టీడీపీ తరపున ఇప్పటికే బరిలో నిలిచిన పనబాక లక్ష్మి.. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు మళ్లీ రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనేది సందేహం. ఇదిలావుంటే.. లైవ్లో దూకుడుగా ఉన్న పార్టీల కంటే.. కూడా ప్రజల్లో పెద్దగా టాక్ లేని కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది మొదలైందని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై వైసీపీలోనూ అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది.
పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చింతా మోహన్.. వైసీపీని ఇటీవల కాలంలో భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ను, వైఎస్ కుటుంబాన్ని.. ఆయన వ్యవహారాన్ని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు.. మేధావులను సైతం ఆలోచింపచేస్తోంది.
జగన్కు పాలన చేతకాదని.. ఆయన వేస్ట్ అని చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారానికి వచ్చాయి. ఆయన ప్రవేశ పెడుతున్న పథకాలు కూడా కాంగ్రెస్ని కాపీ కొట్టినవేనని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని.. ఇలా చింతా మోహన్ తీవ్ర విమర్శలే చేశారు. మొదట్లో వీటిని లైట్ తీసుకున్న వైసీపీ.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చింతా మోహన్కు ఉన్న బలం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపుతున్నాయనే భావిస్తున్నారు. ఇదే జరిగితే.. కొత్త సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయమని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.
పైగా ఇప్పటికే మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ప్రజలను కూడగడుతోంది. మరోవైపు తిరుపతి అభివృద్ది తమదేనని చెబుతోంది. ఇలా అటు వ్యక్తిగతంగా ఇటు పాలన పరంగా కూడా వైసీపీ తిరుపతిలో టార్గెట్ అవుతుండడంతో రేపు ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.
This post was last modified on February 19, 2021 7:21 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…