Political News

మిలటరీ నాయుడికి సర్ ప్రైజ్ ఇచ్చిన జగన్

అధికారంలో లేనప్పుడు అధినేతలకు ముఖం చూపించేందుకు చాలా మంది ఇష్టపడరు. అదే సమయంలో అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత.. తమను విపరీతంగా అభిమానించే వారిని సైతం పెద్దగా పట్టించుకోని నేతలు కొందరుంటారు. ఇందుకు భిన్నంగా మరికొందరు అధినేతల తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. సీఎం జగన్ కానీ.. తమను అమితంగా అభిమానించే వారు ఎక్కడున్నా సరే.. తామేస్వయంగా వారి దగ్గరకు వెళ్లటం అలవాటు. ఇలాంటి సీన్లు వారి జీవితంలో బాగా ఎక్కువే.

అంతేకాదు.. తమను అభిమానించే వారు తమకు దగ్గరగా రాలేని వేళ.. వారికి సాంత్వన కలిగేలా వారి వద్దకే వెళ్లే తీరు సీఎంజగన్ ప్రత్యేకతగా చెప్పాలి. తాజా ఉదంతం ఈ విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేసిందని చెప్పాలి. విశాఖకు వచ్చిన సీఎం జగన్ ను కలిసేందుకు.. చోడవరం మాజీ ఎమ్మెల్యే (గతంలో మూడుసార్లు గెలిచారు సుమా) గూనూరు ఎర్నినాయుడు (అందరూ మిలటరీ నాయుడుగా పిలుస్తారు) తన కొడుకు వంశీ సాయంతో విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చారు.

ఇక్కడ మిలటరీ నాయుడు గురించి కాస్త చెప్పాలి. టీడీపీలో మూడుసార్లు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ మరణం తర్వాత వైఎస్ బాటలో నడిచేందుకు కాంగ్రెస్ లోకి వచ్చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. తాను అభిమానించే సీఎం జగన్ ను చూసేందుకు ఆయన విశాఖ ఎయిర్ పోర్టుకు రాగా.. ఆయన్ను సీఎంను కలిసేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో.. వీఐపీ లాంజ్ కు కాస్త దూరంలో ప్రయాణికులు వెళ్లే దారిలో వెయిట్ చేస్తున్నారు.

జగన్ కాన్వాయ్ బయలుదేరి.. మిలటరీ నాయుడును దాటి పది అడుగులు వెళ్లిన తర్వాత.. వెళుతున్న కాన్వాయ్ ను ఆపించిన సీఎం జగన్.. కారు దిగి నడుచుకుంటూ మిలటరీ నాయుడు వద్దకువెళ్లారు. అప్యాయంగా పలుకరించి.. ఆరోగ్య విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో.. మిలటరీ నాయుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సీఎంను కలిస్తే చాలు అనుకున్నవేళ.. ఆయన్ను సెక్యురిటీ సిబ్బంది అనుమతించకపోతే.. సీఎం స్వయంగా దగ్గరకు వచ్చి.. ఆత్మీయ ఆలింగనం చేసుకోవటాన్ని చూసిన పలువురు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. తనను అభిమానించే వారి విషయంలో జగన్ ఎంత అలెర్టుగా ఉంటారన్న విషయానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పుకోవటం కనిపించింది.

This post was last modified on February 18, 2021 3:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

32 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

1 hour ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

3 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

6 hours ago