ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ధూంధాంగా జరిగింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు తమ సొంత పుట్టినరోజును కూడా జరుపుకోనంత ఘనంగా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో మంత్రి తలసాని అధ్వర్యంలో 67కేజీల కేక్ ను కట్ చేశారు.ఈ కార్యక్రమానికి.. దాదాపుగా మంత్రులు.. నగరానికి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఒక్కరే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో (యూసఫ్ గూడ) శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. టీటీడీ వేదపండితుల్ని ప్రత్యేకతంగా తీసుకొచ్చి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏకంగా 10 వేల మంది హాజరు కావటమే కాదు..వారికి తీర్థప్రసాదాలు మొదలుకొని.. ఒక వివాహ వేడుకను నిర్వహించినంత ఘనంగా వేడుకను జరిపారు.
ఈ రెండు ఉదాహరణలు చాలు.. కేసీఆర్ పుట్టినరోజున టీఆర్ఎస్ నేతలు ఎంత భారీగా వేడుకల్ని నిర్వహించారో అర్థమవుతుంది. వీటితో పాటు.. కేవలం గంట వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా కోటి మొక్కల్ని నాటిన రికార్డును రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం గంట వ్యవధిలోకోటి మొక్కలు నాటేలా ప్లాన్ చేశారు.
మరింత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగే వేళలో.. సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? ఆయన్ను స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే లక్ ఎంతమందికి దక్కిందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయి. తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ తనకెంతో ఇష్టమైన ఫాంహౌస్ లోనే గడిపారు. ఆయన వద్దకే.. కుటుంబ సభ్యులంతా వెళ్లారు. కొడుకు.. కోడలు.. కూతురు అల్లుడు..మనవళ్లు.. మనమరాళ్లు.. ఇలా అందరూ ఫాంహౌస్ కు వెళ్లి కులాసాగా గడిపినట్లుగా చెబుతున్నారు.
ఫాంహౌస్ లో తన పుట్టిన రోజుసందర్భంగా కేసీఆర్ స్వయంగా ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. సో.. సారు పుట్టిన రోజు రాష్ట్రం మొత్తం భారీగా టీఆర్ఎస్ నేతలు జరిపినా.. ఆయన్ను కలిసి విషెస్ చెప్పే లక్ మాత్రం చాలా కొద్దిమందికే లభించిందని చెప్పక తప్పదు.
This post was last modified on February 18, 2021 12:03 pm
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…