విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలవ్వబోతోంది. ఈనెల 20వ తేదీన వైజాగ్ లోని జీవీఎంసి గాంధీ విగ్రహం దగ్గర మొదలయ్యే పాదయాత్ర స్టీలు ప్లాంట్ దగ్గర ముగుస్తుంది. 25 కిలోమీటర్ల పాదయాత్రలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డే స్వయంగా నడుస్తారట. 25 కిలోమీటర్ల పాదయాత్రకు తానే నాయకత్వం వహిస్తానని విజయసాయి చెప్పారు. విజయసాయి పాదయాత్రంటే ఇతర నేతలు కూడా పాల్గొంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఈ పాదయాత్ర వల్ల ఏమిటి ఉపయోగం అన్నదే పెద్ద సందేహం. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నరేంద్రమోడి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సమీక్షించే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. గడచిన మూడున్నర మాసాలుగా వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఈ ఉద్యమాన్ని మోడి ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. వేలాదిమంది రైతులు చేస్తున్న ఉద్యమాన్నే మోడి పట్టించుకోలేదు.
పైగా ఉద్యమసమయంలో సుమారు 60 మంది రైతులు మరణించినా లెక్క చేయలేదు. రైతులు చేస్తున్న ఉద్యమంతో పోల్చుకుంటే ఉక్కుపరిశ్రమ కోసం జరుగుతున్న ఆందోళన చాలా తక్కువనే చెప్పాలి. రైతుఉద్యమంలో పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అలాంటి ఉద్యమాన్నే పట్టించుకోని మోడి ఇక విశాఖలో జరుగుతున్న ఆందోళనను పట్టించుకుంటారా ?
ఉక్కు పరిరక్షణ ఆందోళనల్లో రాజకీయపార్టీల మధ్య ఉన్న అనైక్యత అందరికీ తెలిసిందే. ఏ విషయంలోను అధికార వైసీపీ-ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి పడదు. ఇలాంటి పరిస్దితుల్లో విజయసాయి పాదయాత్ర పేరుతో పెద్ద ప్రహసనాన్నే మొదలు పెట్టబోతున్నారు. ఈ పాదయాత్ర వల్ల కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని అందరికీ తెలిసిందే. మరి కేంద్రంపై ఒత్తిడి తేలేనపుడు పాదయాత్ర చేసి ఉపయోగం ఏమిటి ? ఏమిటంటే ఉక్కు కోసం తాము కూడా ఆందోళన చేశామని చెప్పుకోవటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…