Political News

జగన్ ఏం చెబితే అది చేస్తా.. : బాబు సంచలనం

తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో హీట్ పెంచుతున్న విశాఖ ఉక్కు ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన వాటికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టటం.. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించటం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పల్లాను పరామర్శించారు.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామా చేస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా.. తాము కూడా రాజీనామాలు చేస్తామన్నారు. సీనియర్ నేత అన్న అహం తనకు లేదని.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం కోసం దేనికైనా రెఢీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ చెప్పింది చేస్తా. ప్రజలకు సహకరించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం. ప్రభుత్వంపైనే ఎక్కువ బాధ్యత ఉంది. ప్రతిపక్షంగా సహకరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే వరకు పోరాడతాం’’ అని బాబు వ్యాఖ్యానించారు.

విశాఖ ఉక్కుకర్మాగారం విషయంలో జగన్ ఏం చెబితే అది చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన బాబు.. అదే సమయంలో సీఎంపై తీవ్రంగా మండిపడ్డారు. స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెడితే.. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. ‘ఎక్కడికి వెళ్లారు? తాడేపల్లిలో ఏం చేస్తున్నారు? పబ్ జీ ఆడుకుంటున్నారా? రాష్ట్ర హక్కుల్ని కాపాడలేక ప్రజల సెంటిమెంట్ ను అమ్ముకోవాలని చూసే వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత ఉందా?’’ అని నిప్పులు చెరిగారు. జగన్ కు సహకారం అందిస్తానని చెబుతూనే.. సీఎంపై భారీగా చురకలు వేసిన బాబు తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

This post was last modified on February 17, 2021 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

35 minutes ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago