విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయం తెరమీదికి రాగానే.. ఆ ప్రాంత ప్రజలు సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు.. పల్లా శ్రీనివాస రావు.. ఆమరణ దీక్షకు దిగారు. ఈ దీక్ష పీక్ స్టేజ్కు చేరింది. పల్లాకు మద్దతుగా టీడీపీ భారీగా శ్రేణులను తరలించడం తోపాటు.. కీలక నేతలు సైతం విశాఖకు చేరుకుని.. పల్లాకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు.. చంద్రబాబు కూడా విశాఖకు వెళ్తున్నారు. దీంతో ఉక్కు ఉద్యమం.. అందునా.. టీడీపీ నేతృత్వం లో చేపడుతున్న ఉక్కు ఉద్యమం.. పీక్ స్టేజ్కు చేరుతోందని భావించిన జగన్ సర్కారు ఉక్కు పాదం మోపడం గమనార్హం.
విశాఖ ఉక్కుకోసం ఆమరణ దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాసరావును మంగళవారం తెల్లవారు జామున.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి.. విశాఖ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వెనువెంటనే గ్లూకోజ్ బాటిళ్లను ఎక్కించడం ప్రారంభించారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా టీడీపీ ఆధ్వర్యంలో వేసిన.. శిబిరాలను కూడా అధికారలు తొలగించే ప్రయత్నం చేశారు.
ఇదిలావుంటే.. గుంటూరులోని రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతాంగం.. తాజాగా తమ ఉద్యమాన్ని విశాఖ ఉక్కు వరకు తీసుకువచ్చింది. దాదాపు వంద మంది అమరావతి రైతులు.. విశాఖ ఉక్కు కోసం ఉద్యమి స్తున్న ప్రాంతానికి చేరుకుని.. తమ సంఘీభావం తెలిపారు.
అయితే.. ఇతర ప్రాంతాల వారిని అనుమతించబోమని.. పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరిని అరెస్టు చేయాలా? వద్దా? అనే అంశంపై మాత్రం తర్జన భర్జన పడుతున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. వైసీపిని ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. విశాఖ ఉక్కు కోసం.. తాము కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు ఇలా ఉద్యమం చేస్తున్నవారిని అరెస్టులు చేయడం.. శిబిరాలను ఎత్తేసేలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. మరి వైసీపీ నేతలు ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on February 16, 2021 10:52 am
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…