Political News

విశాఖ ఉక్కు.. సాయిరెడ్డికి స‌వాలే.. రీజ‌నేంటంటే!

విశాఖ ఉక్కును పోస్కో సంస్థ‌కు విక్ర‌యించేందుకు జ‌రు గుతున్న ప‌రిణామాల వెనుక విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పెద్ద ఎత్తు న ‌ప్ర‌చారం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. ఇటీవల ఆయ‌న విశాఖ ఉక్కు కార్మికుల‌ను ప‌రామ‌ర్శించేందుకు అక్క‌డికి వెళ్లారు.

దీంతో అక్క‌డి కార్మికులు.. పార్టీల‌కు అతీతంగానే ఆయ‌న కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. నిజానికి విజ‌య‌సాయికి ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఎవ‌రి నుంచి కూడా ఇలాంటి ప‌రిణామం ఎదురు కాలేదు. దీంతో స్పందించిన ఆయ‌న ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్ ద‌గ్గ‌ర‌ కు ప‌రిశ్ర‌మ కార్మికుల బృందాన్ని కూడా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

అయినా వారు వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ప్ర‌ధాని మోడీతోనే త‌మ‌కు భేటీ ఏర్పాటు చేయించాల‌ని.. అక్క‌డే విష‌యం తేల్చుకుంటామ‌ని చెప్పారు. దీంతో స‌రేన‌న్నారు. అయితే.. ఇది అంత తేలిక కాదు.. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయికి ప్ర‌ధాని అప్పాయింట్మెంట్ ఇవ్వ‌డం లేదు. ఆ మాట‌కొస్తే.. బీజేపీ కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా సాయిరెడ్డితో మాట్లాడ‌డం లేదు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ చైర్మ‌న్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌పై విజ‌య‌సాయిరెడ్డి నోరు పారేసుకున్నారు. దీనిపై బీజేపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో సాయిరెడ్డికి ప్ర‌ధాని నుంచి అప్పాయింట్‌మెంట్ ఆశించ‌డం అంటే.. అది అంత తేలిక విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. ఈ రోజో రేపో.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ రానుంది. ఈ క్ర‌మంలో విశాఖ పీఠంపై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన సాయిరెడ్డి.. ఇప్పుడు విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీని గట్టెక్కించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చి నా.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో విశాఖ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకోవ‌డం సాధ్య‌మేనా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.పైగా మారిన రాజ‌కీయ ప‌రిణామాలు.. టీడీపీ నాయ‌కుల జోరు.. ప‌ల్లా శ్రీనివాస‌రావు.. ఆమ‌ర‌ణ దీక్ష‌.. వంటివి రాజకీయంగా విశాఖ‌ను కుదిపేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సాయిరెడ్డి ఈ యుద్ధంలో ఏమేర‌కు నెగ్గుతారో చూడాలి.

This post was last modified on February 15, 2021 10:01 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

9 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

10 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

13 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

14 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

14 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

14 hours ago