నరేంద్రమోడి మామూలుగా అయితే క్లీన్ షేవ్ లోనే కనిపిస్తారు. కానీ కొద్ది కాలంగా మాత్రం బాగా గడ్డం పెంచేసి కనిపిస్తున్నారు. పెరిగిన గడ్డాన్ని కూడా ట్రిమ్ చేసుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దాంతో ఇపుడో మోడి గడ్డంపై సోషల్ మీడియాలో కామెంట్లు, సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇంతకీ మోడి గడ్డాన్ని పెంచటం వెనుక ఏమైనా రహస్యముందా ? ఉందా అంటే ఉందనే అంటున్నారు నెటిజన్లు.
ఇంతకీ నెటిజన్ల ప్రకారం ఆ రహస్యం ఏమిటయ్యా అంటే తొందరలోనే జరగబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికలేనట. పశ్చిమబెంగాల్ ఎన్నికలకు మోడి గడ్డానికి సంబంధం ఏమిటి ? ఏమిటంటే రబీంద్రనాద్ ఠాగూరే. మన జాతీయ గీతాన్ని రచించింది రబీంద్రనాద్ ఠాగూరన్న విషయం అందరికీ తెలిసిందే. ఠాగోర్ ఫొటోలు ఎక్కడ చూసినా ఎప్పుడూ పెద్ద గడ్డంతోనే కనిపిస్తారు.
రబీంద్రనాద్ ఠాగూర్ అంటే బెంగాలీయులకు ఆరాధ్యదైవమనే చెప్పాలి. అలాంటి ఠాగూర్ ను పోలినట్లుగా ఉండటం కోసం మోడి కూడా బాగా గడ్డాన్ని పెంచేస్తున్నట్ల నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తొందరలోనే బెంగాల్ కు జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎంత వీలైతే అంత చిచ్చు పెడుతున్నారు. వాళ్ళ ఎంపి+ఎంఎల్ఏలను కమలంపార్టీలోకి లాగేసుకుంటున్నారు.
ఇవన్నీ ఒకఎత్తైతే ఎన్నికల్లో మోడినే స్టార్ కాంపైనర్ అన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జరిగే రోడ్డుషోలు, బహిరంగసభల్లో మోడి బెంగాల్లో పర్యటిస్తారు. అప్పుడు తనను చూసిన జనాలకు రబీంద్రనాద్ ఠాగూరే కనబడలాని మోడి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నట్లు సెటైర్లు పడుతున్నాయి. మరి మోడి గడ్డం బీజేపీని బెంగాల్లో గట్టెక్కిస్తుందా ?
This post was last modified on February 14, 2021 1:19 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…