తెలంగాణాలో రాజకీయ అరంగేట్రం చేయించటం ద్వారా షర్మిల రూపంలో కేసీయార్ కు జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా ? అలాగనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణా-ఏపి మధ్య రిటర్న్ గిఫ్ట్ అంశపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్+టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ముందస్తు ఎన్నికల తర్వాత కేసీయార్ ప్రస్తావిస్తూ చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన ప్రకటన అప్పట్లో సంచలనమైంది.
తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ సంగతి కొంతకాలం చర్చ జరిగినా తర్వాత మరుగునపడిపోయింది. అలాంటిది ఇప్పుడు షర్మిల కారణంగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తాజా రిటర్న్ గిఫ్ట్ విషయంలో మాత్రం రెండు రకాలుగా చర్చలు జరుగుతోంది. మొదటిదేమో బీజేపీ+కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు కేసీయార్+జగన్ కలిసే షర్మిలను రంగంలోకి దింపారనేది ఒక చర్చ.
ఇదే సమయంలో షర్మిల పార్టీ పెట్టే విషయంలో జగన్ కు సంబంధం లేదని ఆమె సొంతంగానే నిర్ణయం తీసుకున్నదనేది మరో చర్చ. మొదటి చర్చ ప్రకారమైతే కేసీయార్ కు జగన్ సాయం అందించేందుకు షర్మిల పార్టీ రూపంలో జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. ఇక రెండో పద్దతిలో అయితే చివరకు కేసీయార్ ను కూడా దెబ్బ కొట్టే వ్యూహంతోనే జగన్ తన చెల్లెలిని రంగంలోకి దింపి మంచి రిటర్న్ గిఫ్టే ఇచ్చారని ఎద్దేవా గా చర్చించుకుంటున్నారు.
అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రూపం ఏదైనా కానీండి కేసీయార్ కు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవటమే ముఖ్యం. ఒక్కోసారి మనం ఏదో అంచనాలు వేసుకుని ఓ పని మొదలుపెడతాం. కానీ మనం అనుకున్న పని గ్రౌండ్ అయిన తర్వాత పరిస్ధితులను బట్టి మనం అనుకున్నదానికి భిన్నంగా ఎటెటో వెళిపోతుంది. చివరకు తెలంగాణా రాజకీయాల్లోకి షర్మిల కొత్తపార్టీతో అడుగుపెట్టడం కూడా అలాగే అయిపోతందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పొలిటికల్ వ్యాక్యూమ్ ను గనుక షర్మిల భర్తీ చేయగలిగితే చివరకు ఆమె కేసీయార్ కు ఏకుమేకై కూర్చున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. చూద్దాం ఏమి జరగబోతోందో.
This post was last modified on February 14, 2021 10:30 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…