ఔను! ఇక కండువా మార్చుడే!– అనే కామెంట్.. మాజీ మంత్రి, టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం టికెట్పై పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు గురించి గుసుగుస జోరుగా వినిపిస్తోంది. టీడీపీలో గెలిచినా.. ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో.. మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు.. పార్టీ అదినేత చంద్రబాబుకు కూడా కడు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట.. ఆయన పార్టీ మారి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే.. నేను కాదు.. కుదిరితే.. నా కుమారుడిని జాయిన్ చేస్తా.. అనే స్టేట్ మెంట్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.
ఇక, ఈ వార్తలు ఇలా సాగుతున్న క్రమంలో.. వైసీపీ మంత్రి, ఇదే విశాఖ జిల్లాకు చెందిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు.. గంటా వైసీపీలో ఎలా వస్తారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి ఏమైందో గంటా అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కూడా దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు విశాఖ ఉక్కు విషయం తెరమీదకి రాగానే.. తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు గంటా. అయితే.. ఈ విషయాన్ని ఆయన కనీసం పార్టీ టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ కీలక నేతలకు కానీ.. చెప్పకపోవడం గమనార్హం. అదేసమయంలో ఆయన విశాఖ ఉక్కు కోసమే తను రాజీనామా చేశానని చెప్పి.. మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసినా.. ఈ క్రమంలో టీడీపీ కూడా విశాఖ ఉక్కుకోసం ఉద్యమాలు ప్రారంభించింది. దీనికి మాత్రం గంటా మద్దతివ్వకపోవడం గమనార్హం.
ముఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాసరావు.. ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీనికి టీడీపీలోని నాయకులు మద్దతు తెలిపారు. స్థానికంగా ఉన్న అయ్యన్న పాత్రుడు వంటివారు వెళ్లి సంఘీభావంగా దీక్షలోనూ కూర్చున్నారు. అయితే.. ఏ ఉక్కు కోసం రాజీనామా చేశారో.. అదే ఉక్కు కోసం సొంత పార్టీ నాయకుడు దీక్ష కు దిగితే.. గంటా శ్రీనివాసరావు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
అంతేనా.. వైసీపీ నాయకులు ప్రత్యక్షంగా మద్దతిస్తున్న కార్మికుల నిరసనకు, అందునా.. మంత్రి అవంతి శ్రీనివాసరావు కనుసన్నల్లో జరుగుతున్న కార్యక్రమానికి గంటా హాజరు కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఇద్దరు నాయకులు కూడా ఒకే వేదిక పంచుకున్నారు. ఈ పరిణామాలను గమనించిన వారు.. ఇక, రేపో మాపో.. గంటా వైసీపీలోకి చేరిపోవడం ఖాయమని.. కండువా మార్చుకోవడానికేనని.. అంటుండడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలు.. గంటా వేస్తున్న అడుగులు కూడా ఆదిశగానే ఉండడం విశేషం.
This post was last modified on February 13, 2021 11:47 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…