నిన్న (గురువారం) కొలువు తీరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలిని చూసినప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి దర్శనమిచ్చింది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్న జీహెచ్ఎంసీలో మగాళ్లను మహిళలు ఓడించారు. రిజర్వేషన్ ప్రకారం చూసినప్పుడు 50 శాతం మహిళలు అన్నది అమలు చేసినప్పుడు 75 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి 80 మంది మహిళలు ఎన్నికయ్యారు.
దీంతో 150 మంది కార్పొరేటర్లలో సగం కంటే ఎక్కువగా మహిళలు దర్శనమిచ్చారు. ఇలాంటి సందర్భం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రిజర్వేషన్ విధానంలో ఈసారి మేయర్ గా మహిళను ఎంపిక చేసుకోవాల్సి రావటం.. అనూహ్యంగా డిప్యూటీ మేయర్ ను కూడా మహిళనే ఎంపిక చేయటంతో.. నగరానికి ప్రధమ.. ద్వితీయ రెండు స్థానాలు మహిళలే నిలిచారు.
అంతేకాక.. సగాని కంటే ఎక్కువ కార్పొరేటర్లు మహిళలే కావటంతో.. గ్రేటర్ పాలక మండలి వరకు మగాళ్లను తోసి రాజన్నట్లుగా మహిళలు మారారు. పురుషాధిక్య సమాజంలో.. అందునా రాజకీయాల్లో మహిళలకు అవకాశం అంతంత మాత్రంగా లభించే రోజుల్లో.. అందుకు భిన్నంగా గ్రేటర్ పాలక మండలి మొత్తం మహిళలదే రాజ్యమన్నట్లుగా మారటం విశేషం. మొత్తానికి గ్రేటర్ మగాళ్లను ఓడించిన గ్రేటర్ మహిళలు మారారు. ఇది అరుదైనదిగా చెప్పక తప్పదు.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…