Political News

అన్నింటినీ వదిలించేసుకుంటున్న మోడి

గత ఏడేళ్ళల్లో ఒక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ (పిఎస్ యు) ను కూడా పెట్టని నరేంద్రమోడి ప్రభుత్వం ఉన్న వాటిని వదిలించేసుకుంటోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న 300 పిఎస్ యూలను 24కి కుదించేయాలని డిసైడ్ అయ్యింది. ఉన్నవాటిని సక్రమంగా నడిపించటం చేతకాని నరేంద్రమోడి అన్నింటినీ తెగనమ్మేయటానికి మాత్రం రెడీ అయిపోవటమే విచిత్రంగా ఉంది. తాజాగా రూపొందించిన డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా అమ్మేయాలని అనుకున్న వాటిని రెండు రకాలు అంటే వ్యూహాత్మకం, వ్యూహాత్మకం కానివి అనే రెండు రకాలుగా విభజించింది.

వ్యూహాత్మకరంగంలోని పీఎస్ యూలని కనిష్ట స్ధాయికి తగ్గించేయాలని, వ్యూహాత్మకం కానివాటిని అవకాశం ఉన్నంతలో అమ్మేయాలని డిసైడ్ అయిపోయింది. వ్యూహాత్మకం కానివాటిల్లోని పీఎస్ యూలను అమ్మేయటం, విలీనం చేయటం సాధ్యంకాక పోతే మూసేయాలని నిర్ణయించింది. అణుశక్తి, అంతరిక్షం-రక్షణ, రవాణా-టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, బొగ్గు, పెట్రోలియం, ఇతర ఖనిజాలను డీల్ చేస్తున్న పీఎస్ యూల భారాన్ని వీలైనంత తగ్గించుకోబోతోంది.

మార్కెట్లో ప్రభుత్వ రంగం సంస్ధల పాత్రను తగ్గించేసి ఆ స్ధానంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహించాలని ఓ పాలసీగా పెట్టుకుంది మోడి సర్కార్. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వరంగంలోని ప్రభుత్వ వాటాలను అమ్మేయటం ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసిలో తన వాటాను ఎందుకు ఉపసంహరించుకుంటోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అలాగే ఎల్ఐసీకి అనుబంధంగా ఉన్న ఐడిబీఐ బ్యాంకు, రెండు ప్రభుత్వరంగ సంస్ధలతో పాటు ఓ సాధారణ బీమా కంపెనీని కూడా ప్రైవేటుపరం చేసేయటానికి రంగం రెడీ అయిపోయింది.

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ లోని మిశ్రదాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని), బీఈఎంఎల్, జీఆర్ఎస్ఈ లను తొందరలో ప్రైవేటుకు అమ్మేయబోతోంది. నిజానికి ఈ నాలుగు సంస్ధలు రక్షణ రంగానికి సంబంధించినవి. హోలు మొత్తం మీద చూస్తే అర్ధమవుతున్నదేమంటే తొందరలోనే ప్రభుత్వరంగ సంస్ధల్లో చాలావరకు ప్రైవేటుపరం అయిపోతున్నాయి. మరి 2014 ఎన్నికల సమయంలో బీజేపీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన లాంటి హామీలు ఏమయ్యాయో ఎవరికీ అర్ధం కావటం లేదు.

This post was last modified on February 10, 2021 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్ మార‌డం అన్న‌ది మామూలైపోయింది. ఐతే…

1 hour ago

విజయ్ గురించి మన వాళ్లు కొట్టేసుకుంటున్నారు

ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…

3 hours ago

94 వయసులో ‘సింగీతం’ మాయాజలం

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…

4 hours ago

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్.. ఎవరెవరికి ఎంత ఛాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…

6 hours ago

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…

7 hours ago

లండన్ కొలువులో కొడుకు… తల్లికి ఇందిరమ్మ ఇల్లు

సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…

8 hours ago