ఇంకా కొత్తపార్టీని వైఎస్ షర్మిల ఏర్పాటే చేయలేదు. తాను పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టంగా ప్రకటన కూడా చేయలేదు. రాజన్న రాజ్యంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకే వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో సమావేశం నిర్వహించినట్లు షర్మిల స్పష్టంగా చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లో జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అయితే షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీపై అప్పుడే వ్యతిరేకత మొదలైపోయింది.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆంధ్రా పార్టీకి తెలంగాణాలో ఏమిపనంటు మండిపడ్డారు. తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమే లేదన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు తెలంగాణాలో అవకాశం లేదని చెప్పారు. వైఎస్ షర్మిల వచ్చి తెలంగాణాలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటంటూ గంగుల ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. ఓ మూడు రోజుల క్రితం ఎవరి పేరును ప్రస్తావించకుండానే కేసీయార్ మాట్లాడుతు కొత్తపార్టీ పెట్టడం అంత ఈజీనా అంటు ప్రశ్నించారు.
గతంలో బీజేపీ నేత ఆలె నరేంద్ర, విజయశాంతి పెట్టిన పార్టీలు ఏమయ్యాయంటు ఎద్దేవా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నిజానికి ఈ రెండు పార్టీలను టీఆర్ఎస్సే విలీనం చేసేసుకున్నది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో చెల్లెలు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టుడేంది అంటు ఎకసక్కాలాడారు. అన్నమీద కోపం ఉంటే పెట్టే పార్టీ ఏదో ఏపిలోనే పెట్టాలి కానీ తెలంగాణాలో పెట్టడం బావోలేదన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చటం కోసమే షర్మిల పార్టీ పెడుతున్నట్లు మండిపడ్డారు.
బీజేపీ మాజీ ఎంఎల్ఏ ఎంవివిఎస్ ప్రభాకర్ మాట్లాడుతు వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఓ కుట్రగా అభివర్ణించారు. బీజేపీని దెబ్బ కొట్టడం కోసమే షర్మిలతో కేసీయారే పార్టీ పెట్టిస్తున్నట్లు మండిపడ్డారు. కేసీయార్+జగన్+షర్మిల ఎన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రానీకుండా బీజేపీని ఎవరు అడ్డుకోలేరని పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చేశారు. మొత్తానికి ఇంకా పురుడు కూడా పోసుకోని పార్టీపై అప్పుడే ఇతర పార్టీల నుండి వ్యతిరేకత మొదలైపోయిందంటే ఏమిటర్ధం ?
This post was last modified on February 10, 2021 11:03 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…