హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ నగ్మా చాలా కాలం తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఆమెను నిన్నట్నుంచి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ‘నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్థాన్’ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. పదేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నగ్మా.. ఇటీవల ఓ టీవీ చర్చలో పాకిస్థాన్ జర్నలిస్టుకు మద్దతుగా నిలవడమే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటానికి కారణం.
ఇండియాలో మైనారిటీల సమస్యలు, భారత్-పాక్ సంబంధాలకు సంబంధించి తాజాగా ఆజ్ తక్ హిందీ ఛానెల్ ఓ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా తారిక్ పీర్జాదా అనే పాకిస్థాన్ జర్నలిస్టును కూడా లైవ్ లోకి తీసుకున్నారు. ఐతే ఆ జర్నలిస్టు భారత్ మీద విషం చిమ్మేలా మాట్లాడాడు. పాకిస్థాన్ను పొగిడే పని పెట్టుకున్నాడు.
దీంతో టీవీ ఛానెల్ ప్రతినిధి పాక్ జర్నలిస్టును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఐతే ఈ చర్చలో నగ్మా కూడా పాల్గొనగా.. పొరుగు దేశ జర్నలిస్టును చర్చకు పిలిచి అవమానించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత ట్విట్టర్లో దీనిపై స్పందించింది. పాక్ జర్నలిస్టును చర్చకు ఎందుకు పిలిచారు.. పిలిచి ఎందుకు అవమానించారు అంటూ ఆమె ట్వీట్ చేసింది.
ఐతే భారత్ మీద విమర్శలు గుప్పించిన జర్నలిస్టుకు సమాధానం ఇవ్వడం తప్పా.. దీనికి మన వాళ్లను తప్పుబడతావా అంటూ నెటిజన్లు నగ్మాను టార్గెట్ చేశారు. ఆమె పాకిస్థాన్కు మద్దతుగా నిలుస్తోందని.. కాంగ్రెస్ లీడర్లందరూ అంతే అని అంటున్నారు.
కొన్ని రోజులు కిందట కశ్మీరీ వాసుల గురించి ఆమె చేసిన ట్వీట్లను కూడా బయటికి తీశారు. కశ్మీరీలకు సరైన సాయం అందట్లేదని.. వాళ్లు రాళ్ల దాడి చేయడంలో తప్పేం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నగ్మా మతం ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. ఆమె తండ్రి హిందువు కాగా.. తల్లి ముస్లిం.
This post was last modified on May 7, 2020 4:41 pm
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…