Political News

నగ్మాను ఆడుకుంటున్న నెటిజన్లు

హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ నగ్మా చాలా కాలం తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఆమెను నిన్నట్నుంచి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ‘నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్థాన్’ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. పదేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నగ్మా.. ఇటీవల ఓ టీవీ చర్చలో పాకిస్థాన్ జర్నలిస్టుకు మద్దతుగా నిలవడమే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటానికి కారణం.

ఇండియాలో మైనారిటీల సమస్యలు, భారత్-పాక్ సంబంధాలకు సంబంధించి తాజాగా ఆజ్ తక్ హిందీ ఛానెల్ ఓ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా తారిక్ పీర్జాదా అనే పాకిస్థాన్ జర్నలిస్టును కూడా లైవ్ లోకి తీసుకున్నారు. ఐతే ఆ జర్నలిస్టు భారత్ మీద విషం చిమ్మేలా మాట్లాడాడు. పాకిస్థాన్‌ను పొగిడే పని పెట్టుకున్నాడు.

దీంతో టీవీ ఛానెల్ ప్రతినిధి పాక్ జర్నలిస్టును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఐతే ఈ చర్చలో నగ్మా కూడా పాల్గొనగా.. పొరుగు దేశ జర్నలిస్టును చర్చకు పిలిచి అవమానించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత ట్విట్టర్లో దీనిపై స్పందించింది. పాక్ జర్నలిస్టును చర్చకు ఎందుకు పిలిచారు.. పిలిచి ఎందుకు అవమానించారు అంటూ ఆమె ట్వీట్ చేసింది.

ఐతే భారత్‌ మీద విమర్శలు గుప్పించిన జర్నలిస్టుకు సమాధానం ఇవ్వడం తప్పా.. దీనికి మన వాళ్లను తప్పుబడతావా అంటూ నెటిజన్లు నగ్మాను టార్గెట్ చేశారు. ఆమె పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోందని.. కాంగ్రెస్ లీడర్లందరూ అంతే అని అంటున్నారు.

కొన్ని రోజులు కిందట కశ్మీరీ వాసుల గురించి ఆమె చేసిన ట్వీట్లను కూడా బయటికి తీశారు. కశ్మీరీలకు సరైన సాయం అందట్లేదని.. వాళ్లు రాళ్ల దాడి చేయడంలో తప్పేం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నగ్మా మతం ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. ఆమె తండ్రి హిందువు కాగా.. తల్లి ముస్లిం.

This post was last modified on May 7, 2020 4:41 pm

Share

Recent Posts

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

42 minutes ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

50 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

1 hour ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

2 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago