హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ నగ్మా చాలా కాలం తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఆమెను నిన్నట్నుంచి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ‘నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్థాన్’ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. పదేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నగ్మా.. ఇటీవల ఓ టీవీ చర్చలో పాకిస్థాన్ జర్నలిస్టుకు మద్దతుగా నిలవడమే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటానికి కారణం.
ఇండియాలో మైనారిటీల సమస్యలు, భారత్-పాక్ సంబంధాలకు సంబంధించి తాజాగా ఆజ్ తక్ హిందీ ఛానెల్ ఓ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా తారిక్ పీర్జాదా అనే పాకిస్థాన్ జర్నలిస్టును కూడా లైవ్ లోకి తీసుకున్నారు. ఐతే ఆ జర్నలిస్టు భారత్ మీద విషం చిమ్మేలా మాట్లాడాడు. పాకిస్థాన్ను పొగిడే పని పెట్టుకున్నాడు.
దీంతో టీవీ ఛానెల్ ప్రతినిధి పాక్ జర్నలిస్టును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఐతే ఈ చర్చలో నగ్మా కూడా పాల్గొనగా.. పొరుగు దేశ జర్నలిస్టును చర్చకు పిలిచి అవమానించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత ట్విట్టర్లో దీనిపై స్పందించింది. పాక్ జర్నలిస్టును చర్చకు ఎందుకు పిలిచారు.. పిలిచి ఎందుకు అవమానించారు అంటూ ఆమె ట్వీట్ చేసింది.
ఐతే భారత్ మీద విమర్శలు గుప్పించిన జర్నలిస్టుకు సమాధానం ఇవ్వడం తప్పా.. దీనికి మన వాళ్లను తప్పుబడతావా అంటూ నెటిజన్లు నగ్మాను టార్గెట్ చేశారు. ఆమె పాకిస్థాన్కు మద్దతుగా నిలుస్తోందని.. కాంగ్రెస్ లీడర్లందరూ అంతే అని అంటున్నారు.
కొన్ని రోజులు కిందట కశ్మీరీ వాసుల గురించి ఆమె చేసిన ట్వీట్లను కూడా బయటికి తీశారు. కశ్మీరీలకు సరైన సాయం అందట్లేదని.. వాళ్లు రాళ్ల దాడి చేయడంలో తప్పేం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నగ్మా మతం ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. ఆమె తండ్రి హిందువు కాగా.. తల్లి ముస్లిం.
This post was last modified on May 7, 2020 4:41 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…