ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వరకు హౌస్ అరెస్టు చేయాలని.. డీజీపీ గౌతం సవాంగ్ను ఆదేశిస్తూ.. ప్రొసీడింగ్స్ జారీ చేశారు. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్ఈసీ తేల్చిచెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ పేర్కొనడం గమనార్హం.
ఇక, ఇదేసమయంలో తమకు ఈ అధికారం ఉందా? లేదా? అనే విషయంలోనూ నిమ్మగడ్డ క్లారిటీ ఇచ్చారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు.. ఇతర రాష్ట్రాల్లో ఎస్ ఈసీ తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకునే తాము ఈ విధంగా వ్యవహరించామని.. నిమ్మగడ్డ పేర్కొనడం గమనార్హం. ఇక, మంత్రి విషయానికి వస్తే.. ఇటీవల రెండు రోజులుగా పెద్దిరెడ్డి.. కొంతమేరకు దూకుడుగానే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి దృష్టంతా నిమ్మగడ్డపైనే ఉంది. ఇటీవల పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్ లిస్ట్లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని హెచ్చరించారు. దీంతో ఈ పరిణామం.. అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు మధ్య తీవ్ర సంకటంగా మారింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ తాజాగా మంత్రి పెద్దిరెడ్డిని నిలువరిస్తూ.. ఈ నెల 21 వరకు ఇంటి నుంచి కదలనీయరాదని ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…