Political News

టీడీపీ కోసం.. జ‌గ‌న్ త్యాగం.. షాకింగ్ డెసిష‌న్‌!

అదేంటి? టీడీపీ కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ త్యాగం చేయ‌డ‌మేంటి? టీడీపీ అంటేనే నిప్పులు తొక్కుతా రు క‌దా! అని అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు మ‌జా! అయితే.. ఇది.. టీడీపీని అణ‌గ‌దొక్కేందు కు జ‌గ‌న్ చేస్తున్న త్యాగం. బ‌ల‌మైన నేత‌ను సైతం… టీడీపీకి చెక్ పెట్టేందుకు త్యాగం చేస్తున్నారట‌.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. కాపు నాయ‌కుడుగా కూడా.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. పార్టీలో చేరింది. ఎన్నిక‌ల‌కు ముందే అయినా.. సీనియ‌ర్ల మాదిరిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్.. ఆమంచికి మంచి మార్కేలేసి.. కీల‌క నేత‌గా గుర్తించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆమంచి అనూహ్య‌మైన ఓట‌మి పొందారు. చీరాల నుంచి టీడీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే.. ఏడాది లోపే క‌ర‌ణం.. త‌న కుమారుడు వెంక‌టేష్ ను వైసీపీలో చేర్చారు. ఈ క్ర‌మంలోనే తాను కూడా టీడీపీకి డిస్టెన్స్ పాటిస్తూ.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా ఉన్నారు. దీంతో చీరాల వైసీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్ప‌డ్డాయి. త‌ర‌చుగా క‌ర‌ణం వ‌ర్సెస్ ఆమంచి వ‌ర్గాల మ‌ధ్య వివాదం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో.. ఇరు ప‌క్షాలు పోలీసు కేసులు కూడా పెట్టుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో చీరాల ను క‌ర‌ణం కు వ‌దిలి పెట్టి.. ఆమంచిని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. దీనికి ఆమంచి స‌సేమిరా అంటున్నారు. చీరాల‌ను వ‌దిలి పెట్టేది లేద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. ఆమంచిని స‌ర్ది చెప్పి.. క‌ర‌ణంను వ‌దులుకుంటే.. బ‌ల‌మైన టీడీపీ నేత మ‌న‌కు దూర‌మ‌వుతార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర‌ణం ద్వారా ప్ర‌కాశం టీడీపీకి చెక్ పెట్టేద్దామ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ ద్వారా.. ఆమంచికి క‌బురు పంపిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. ప‌రుచూరు వెళ్లేందుకు ఓకే అంటే.. ఆమంచికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని జ‌గ‌న్ క‌బురు పంపార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌య‌మే.. వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆమంచికి ఎలాంటి ప‌ద‌వీ లేకుండా పోయింది. ఫ‌లితంగా కేడ‌ర్‌లోనూ నిరుత్సాహం గూడుక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఏదైనా ప‌ద‌వి కోసం ఆమంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా.. కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కూడా త్యాగం చేసేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on February 5, 2021 11:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వీటీ పెళ్లి వార్త.. ఈసారైనా నిజమవుతుందా?

ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…

4 hours ago

అల్లు శిరీష్ అంత మాట అనేశాడేంటి?

టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…

4 hours ago

‘నెలసరి’ సెలవులపై సుప్రీం చెప్పింది కరెక్టేనా?

కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…

5 hours ago

స్టాంపు సైజులో బాబు ఫోటో… వర్మ ఫైర్

పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…

6 hours ago

ఎంజీఆర్ దేవుడు.. క్షమించండి – రాజేంద్ర ప్రసాద్

స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…

7 hours ago

మళ్ళీ పవనే రక్షకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…

7 hours ago