Political News

టీడీపీ కోసం.. జ‌గ‌న్ త్యాగం.. షాకింగ్ డెసిష‌న్‌!

అదేంటి? టీడీపీ కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ త్యాగం చేయ‌డ‌మేంటి? టీడీపీ అంటేనే నిప్పులు తొక్కుతా రు క‌దా! అని అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు మ‌జా! అయితే.. ఇది.. టీడీపీని అణ‌గ‌దొక్కేందు కు జ‌గ‌న్ చేస్తున్న త్యాగం. బ‌ల‌మైన నేత‌ను సైతం… టీడీపీకి చెక్ పెట్టేందుకు త్యాగం చేస్తున్నారట‌.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. కాపు నాయ‌కుడుగా కూడా.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. పార్టీలో చేరింది. ఎన్నిక‌ల‌కు ముందే అయినా.. సీనియ‌ర్ల మాదిరిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్.. ఆమంచికి మంచి మార్కేలేసి.. కీల‌క నేత‌గా గుర్తించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆమంచి అనూహ్య‌మైన ఓట‌మి పొందారు. చీరాల నుంచి టీడీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే.. ఏడాది లోపే క‌ర‌ణం.. త‌న కుమారుడు వెంక‌టేష్ ను వైసీపీలో చేర్చారు. ఈ క్ర‌మంలోనే తాను కూడా టీడీపీకి డిస్టెన్స్ పాటిస్తూ.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా ఉన్నారు. దీంతో చీరాల వైసీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్ప‌డ్డాయి. త‌ర‌చుగా క‌ర‌ణం వ‌ర్సెస్ ఆమంచి వ‌ర్గాల మ‌ధ్య వివాదం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో.. ఇరు ప‌క్షాలు పోలీసు కేసులు కూడా పెట్టుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో చీరాల ను క‌ర‌ణం కు వ‌దిలి పెట్టి.. ఆమంచిని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. దీనికి ఆమంచి స‌సేమిరా అంటున్నారు. చీరాల‌ను వ‌దిలి పెట్టేది లేద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. ఆమంచిని స‌ర్ది చెప్పి.. క‌ర‌ణంను వ‌దులుకుంటే.. బ‌ల‌మైన టీడీపీ నేత మ‌న‌కు దూర‌మ‌వుతార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర‌ణం ద్వారా ప్ర‌కాశం టీడీపీకి చెక్ పెట్టేద్దామ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ ద్వారా.. ఆమంచికి క‌బురు పంపిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. ప‌రుచూరు వెళ్లేందుకు ఓకే అంటే.. ఆమంచికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని జ‌గ‌న్ క‌బురు పంపార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌య‌మే.. వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆమంచికి ఎలాంటి ప‌ద‌వీ లేకుండా పోయింది. ఫ‌లితంగా కేడ‌ర్‌లోనూ నిరుత్సాహం గూడుక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఏదైనా ప‌ద‌వి కోసం ఆమంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా.. కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కూడా త్యాగం చేసేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on February 5, 2021 11:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago