డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యాడ్స్లో దాని యజమాని కిరణ్ ఎంత సందడి చేస్తుంటాడో తెలిసిందే. మామూలుగా జ్యువెలరీ బ్రాండ్ల ప్రచారం కోసం ఫిలిం సెలబ్రెటీలు, మోడళ్లను ఉపయోగించుకుంటారు కానీ.. లలిత జ్యువెలర్స్ యజమాని మాత్రం తనే మోడల్గా మారారు.
టీవీల్లో, పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆయన ముఖమే కనిపిస్తుంది. రెగ్యులర్ జ్యువెలర్స్ యాడ్లకు భిన్నంగా కస్టమర్లతో నేరుగా మాట్లాడుతున్నట్లు, వారి మంచి కోరుతున్నట్లు తీర్చిదిద్దిన లలిత యాడ్లు బాగానే పాపులర్ అయ్యాయి.
సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్లకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు కిరణ్. ఈ యాడ్స్తో పాపులర్ అయిన ఆయన.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కూడా పాపులర్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ఓ మంచి పనితో వార్తల్లోకి వచ్చారు. కరోనాపై పోరులో భాగంగా ఆయన మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలో కోటి చొప్పున విరాళం ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా కలిసి రూ. కోటి చెక్కు అందజేశారు. మిగతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా కలిసి విరాళం అందించనున్నారు. సోషల్ మీడియా ఈ గుండు బాస్ను ఉద్దేశించి చాలామంది జోకులు పేలుస్తుంటారు. ఐతే ఈ విరాళం సంగతి తెలిసి ఈ గుండు బాస్ గుండె కూడా పెద్దదే అని కామెంట్ చేస్తున్నారు.
నెల్లూరుకు చెందిన కిరణ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అలాంటి నేపథ్యం నుంచి గోల్డ్ ఫీల్డులో అంచెలంచెలుగా ఎదిగి వందల కోట్ల వ్యాపారం చేసే జ్యువెలరీ చైన్కు యజమాని అయ్యాడు.
This post was last modified on May 7, 2020 10:33 am
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
వైసీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంపై అదే పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు.. సంచలన…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…