డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యాడ్స్లో దాని యజమాని కిరణ్ ఎంత సందడి చేస్తుంటాడో తెలిసిందే. మామూలుగా జ్యువెలరీ బ్రాండ్ల ప్రచారం కోసం ఫిలిం సెలబ్రెటీలు, మోడళ్లను ఉపయోగించుకుంటారు కానీ.. లలిత జ్యువెలర్స్ యజమాని మాత్రం తనే మోడల్గా మారారు.
టీవీల్లో, పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆయన ముఖమే కనిపిస్తుంది. రెగ్యులర్ జ్యువెలర్స్ యాడ్లకు భిన్నంగా కస్టమర్లతో నేరుగా మాట్లాడుతున్నట్లు, వారి మంచి కోరుతున్నట్లు తీర్చిదిద్దిన లలిత యాడ్లు బాగానే పాపులర్ అయ్యాయి.
సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్లకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు కిరణ్. ఈ యాడ్స్తో పాపులర్ అయిన ఆయన.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కూడా పాపులర్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ఓ మంచి పనితో వార్తల్లోకి వచ్చారు. కరోనాపై పోరులో భాగంగా ఆయన మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలో కోటి చొప్పున విరాళం ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా కలిసి రూ. కోటి చెక్కు అందజేశారు. మిగతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా కలిసి విరాళం అందించనున్నారు. సోషల్ మీడియా ఈ గుండు బాస్ను ఉద్దేశించి చాలామంది జోకులు పేలుస్తుంటారు. ఐతే ఈ విరాళం సంగతి తెలిసి ఈ గుండు బాస్ గుండె కూడా పెద్దదే అని కామెంట్ చేస్తున్నారు.
నెల్లూరుకు చెందిన కిరణ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అలాంటి నేపథ్యం నుంచి గోల్డ్ ఫీల్డులో అంచెలంచెలుగా ఎదిగి వందల కోట్ల వ్యాపారం చేసే జ్యువెలరీ చైన్కు యజమాని అయ్యాడు.
This post was last modified on May 7, 2020 10:33 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…