డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యాడ్స్లో దాని యజమాని కిరణ్ ఎంత సందడి చేస్తుంటాడో తెలిసిందే. మామూలుగా జ్యువెలరీ బ్రాండ్ల ప్రచారం కోసం ఫిలిం సెలబ్రెటీలు, మోడళ్లను ఉపయోగించుకుంటారు కానీ.. లలిత జ్యువెలర్స్ యజమాని మాత్రం తనే మోడల్గా మారారు.
టీవీల్లో, పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆయన ముఖమే కనిపిస్తుంది. రెగ్యులర్ జ్యువెలర్స్ యాడ్లకు భిన్నంగా కస్టమర్లతో నేరుగా మాట్లాడుతున్నట్లు, వారి మంచి కోరుతున్నట్లు తీర్చిదిద్దిన లలిత యాడ్లు బాగానే పాపులర్ అయ్యాయి.
సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్లకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు కిరణ్. ఈ యాడ్స్తో పాపులర్ అయిన ఆయన.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కూడా పాపులర్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ఓ మంచి పనితో వార్తల్లోకి వచ్చారు. కరోనాపై పోరులో భాగంగా ఆయన మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలో కోటి చొప్పున విరాళం ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా కలిసి రూ. కోటి చెక్కు అందజేశారు. మిగతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా కలిసి విరాళం అందించనున్నారు. సోషల్ మీడియా ఈ గుండు బాస్ను ఉద్దేశించి చాలామంది జోకులు పేలుస్తుంటారు. ఐతే ఈ విరాళం సంగతి తెలిసి ఈ గుండు బాస్ గుండె కూడా పెద్దదే అని కామెంట్ చేస్తున్నారు.
నెల్లూరుకు చెందిన కిరణ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అలాంటి నేపథ్యం నుంచి గోల్డ్ ఫీల్డులో అంచెలంచెలుగా ఎదిగి వందల కోట్ల వ్యాపారం చేసే జ్యువెలరీ చైన్కు యజమాని అయ్యాడు.
సినిమా పిచ్చిలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఇది వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్…
తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా…
ఫౌజీ విడుదల డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించాక ఇతర సినిమాల నిర్మాతలు అలెర్ట్ అయ్యారు. ఆ స్లాట్ లో రావాలని…
ఇప్పటికే టెస్ట్, టీ20 లకు దూరమైన హిట్ మ్యాన్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ మొదలైంది. ఇంగ్లాండ్తో…
వచ్చే వారం విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీకి ఏదైనా సమస్య ఉందంటే, అది ఒక రోజు ముందు జన…
నిన్న విడుదలైన ఫౌజీ ఫస్ట్ లుక్ మీద చర్చలు, మీమ్స్ మొదలైపోయాయి. రెగ్యులర్ హీరో గెటప్ కాకుండా ప్రభాస్ ని…