రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గంపగుత్తుగా పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే.. ప్రకాశం జిల్లా పరుచూరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు పార్టీకి అండగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలకు-ఇక్కడ గెలిచిన టీడీపీ నేతలకు మధ్య మంచి కనెక్టివిటీ ఉండడం గమనార్హం.
పరుచూరు విషయం తీసుకుంటే.. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు.. వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఈయన క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం తో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. రైతులకు ఎప్పుడు ఏది అవసరంవచ్చినా.. నేనున్నానంటూ.. ఏలూరి స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ సాగునీటికి ప్రత్యేకంగా కృషి చేసి.. వారి కోరిక నెరవేర్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోయినా.. తను వ్యక్తిగతంగా ఇక్కడి రైతాంగానికి అండగా ఉంటున్నారు. దీంతో పరుచూరు పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ టీడీపీ హవా జోరుగా సాగుతోంది.
పాలకొల్లు విషయానికి వస్తే.. నిమ్మల రామానాయుడు తనదైన ముద్ర వేశారు. వరుసగా రెండో సారి విజయం సాధించిన రామానాయుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఏ సమస్య వచ్చినా.. ప్రజ లకు నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. అవినీతి రహితంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, రైతులకు బాగా చేరువయ్యారు. దీంతో పాలకొల్లు పరిధిలో .. నిమ్మల మాటకు తిరుగులేకుండా ఉందనే ప్రచారం సాగుతోంది. సో.. ఇక్కడ కూడా టీడీపీకి విజయమే తప్ప.. మరోమాటే లేదని .. అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 1, 2021 7:25 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…