రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గంపగుత్తుగా పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే.. ప్రకాశం జిల్లా పరుచూరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు పార్టీకి అండగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలకు-ఇక్కడ గెలిచిన టీడీపీ నేతలకు మధ్య మంచి కనెక్టివిటీ ఉండడం గమనార్హం.
పరుచూరు విషయం తీసుకుంటే.. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు.. వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఈయన క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం తో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. రైతులకు ఎప్పుడు ఏది అవసరంవచ్చినా.. నేనున్నానంటూ.. ఏలూరి స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ సాగునీటికి ప్రత్యేకంగా కృషి చేసి.. వారి కోరిక నెరవేర్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోయినా.. తను వ్యక్తిగతంగా ఇక్కడి రైతాంగానికి అండగా ఉంటున్నారు. దీంతో పరుచూరు పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ టీడీపీ హవా జోరుగా సాగుతోంది.
పాలకొల్లు విషయానికి వస్తే.. నిమ్మల రామానాయుడు తనదైన ముద్ర వేశారు. వరుసగా రెండో సారి విజయం సాధించిన రామానాయుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఏ సమస్య వచ్చినా.. ప్రజ లకు నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. అవినీతి రహితంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, రైతులకు బాగా చేరువయ్యారు. దీంతో పాలకొల్లు పరిధిలో .. నిమ్మల మాటకు తిరుగులేకుండా ఉందనే ప్రచారం సాగుతోంది. సో.. ఇక్కడ కూడా టీడీపీకి విజయమే తప్ప.. మరోమాటే లేదని .. అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…