రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గంపగుత్తుగా పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే.. ప్రకాశం జిల్లా పరుచూరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు పార్టీకి అండగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలకు-ఇక్కడ గెలిచిన టీడీపీ నేతలకు మధ్య మంచి కనెక్టివిటీ ఉండడం గమనార్హం.
పరుచూరు విషయం తీసుకుంటే.. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు.. వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఈయన క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం తో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. రైతులకు ఎప్పుడు ఏది అవసరంవచ్చినా.. నేనున్నానంటూ.. ఏలూరి స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ సాగునీటికి ప్రత్యేకంగా కృషి చేసి.. వారి కోరిక నెరవేర్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోయినా.. తను వ్యక్తిగతంగా ఇక్కడి రైతాంగానికి అండగా ఉంటున్నారు. దీంతో పరుచూరు పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ టీడీపీ హవా జోరుగా సాగుతోంది.
పాలకొల్లు విషయానికి వస్తే.. నిమ్మల రామానాయుడు తనదైన ముద్ర వేశారు. వరుసగా రెండో సారి విజయం సాధించిన రామానాయుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఏ సమస్య వచ్చినా.. ప్రజ లకు నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. అవినీతి రహితంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, రైతులకు బాగా చేరువయ్యారు. దీంతో పాలకొల్లు పరిధిలో .. నిమ్మల మాటకు తిరుగులేకుండా ఉందనే ప్రచారం సాగుతోంది. సో.. ఇక్కడ కూడా టీడీపీకి విజయమే తప్ప.. మరోమాటే లేదని .. అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 1, 2021 7:25 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…