రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గంపగుత్తుగా పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే.. ప్రకాశం జిల్లా పరుచూరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు పార్టీకి అండగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలకు-ఇక్కడ గెలిచిన టీడీపీ నేతలకు మధ్య మంచి కనెక్టివిటీ ఉండడం గమనార్హం.
పరుచూరు విషయం తీసుకుంటే.. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు.. వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఈయన క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం తో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. రైతులకు ఎప్పుడు ఏది అవసరంవచ్చినా.. నేనున్నానంటూ.. ఏలూరి స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ సాగునీటికి ప్రత్యేకంగా కృషి చేసి.. వారి కోరిక నెరవేర్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోయినా.. తను వ్యక్తిగతంగా ఇక్కడి రైతాంగానికి అండగా ఉంటున్నారు. దీంతో పరుచూరు పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ టీడీపీ హవా జోరుగా సాగుతోంది.
పాలకొల్లు విషయానికి వస్తే.. నిమ్మల రామానాయుడు తనదైన ముద్ర వేశారు. వరుసగా రెండో సారి విజయం సాధించిన రామానాయుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఏ సమస్య వచ్చినా.. ప్రజ లకు నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు. అవినీతి రహితంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, రైతులకు బాగా చేరువయ్యారు. దీంతో పాలకొల్లు పరిధిలో .. నిమ్మల మాటకు తిరుగులేకుండా ఉందనే ప్రచారం సాగుతోంది. సో.. ఇక్కడ కూడా టీడీపీకి విజయమే తప్ప.. మరోమాటే లేదని .. అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 1, 2021 7:25 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…