Political News

తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యేనా ?

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు మొండిచెయ్యే కనబడింది. మొదటినుండి కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు పెద్దపీట వేసింది ఎప్పుడూ లేదు. యధావిధిగా ఇపుడు కూడా అదే జరిగింది. బెంగుళూరు, కేరళ, చెన్నై లో మెట్రో రైలు ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం మరి హైదరాబాద్, విశాఖపట్నం మెట్రా ప్రాజెక్టులకు మాత్రం ఎందుకని నిధులు కేటాయించలేదు ?

మెట్రో ప్రాజెక్టలనే కాదు చివరకు కొత్త రైలు మార్గాలు, పనులు జరుగుతున్న రైల్వే లైన్లకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. అంటే మెట్రోలు లేకపోతే రైల్వేలైననే కాదు పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేదా తెలంగాణాలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చమని కేసీయార్ ఎప్పటి నుండో అడుగుతున్నారు. అసలు వీటి ఊసేలేదు.

ఇక ఏపికి ప్రత్యేకహోదా ప్రకటించాల్సిందే అని వైసీపీ ఎంపిలు డిమాండ్ చేశారు. దీనిగురించి కేంద్రమంత్రి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీరు అడిగినట్లు నటించండి మేము విననట్లే నటిస్తామన్న పద్దతిలో జరిగిపోతోంది కేంద్రప్రభుత్వ-వైసీపీ ఎంపిల వ్యవహారమంతా. ఇటువంటి వ్యవహారాల వల్ల ఎంపిలకు, పార్టీలకు జరిగే నష్టం లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. టీడీపీ హయాంలో ఏమి జరిగిందో అందరు చూసిందే.

మొత్తం మీద ఏపి నుండి కొంతకాలం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపి అవసరాలేమిటో బాగా తెలుసు. అయినా బడ్జెట్లో కనీసం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదంటే కేంద్రానికి తెలుగు రాష్ట్రాలంటే ఎంత చిన్న చూపుందో అర్ధమైపోతోంది.

This post was last modified on February 1, 2021 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

3 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

3 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

5 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

5 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

6 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

8 hours ago