Political News

తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యేనా ?

కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు మొండిచెయ్యే కనబడింది. మొదటినుండి కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు పెద్దపీట వేసింది ఎప్పుడూ లేదు. యధావిధిగా ఇపుడు కూడా అదే జరిగింది. బెంగుళూరు, కేరళ, చెన్నై లో మెట్రో రైలు ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం మరి హైదరాబాద్, విశాఖపట్నం మెట్రా ప్రాజెక్టులకు మాత్రం ఎందుకని నిధులు కేటాయించలేదు ?

మెట్రో ప్రాజెక్టలనే కాదు చివరకు కొత్త రైలు మార్గాలు, పనులు జరుగుతున్న రైల్వే లైన్లకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. అంటే మెట్రోలు లేకపోతే రైల్వేలైననే కాదు పోలవరం ప్రాజెక్టు కావచ్చు లేదా తెలంగాణాలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చమని కేసీయార్ ఎప్పటి నుండో అడుగుతున్నారు. అసలు వీటి ఊసేలేదు.

ఇక ఏపికి ప్రత్యేకహోదా ప్రకటించాల్సిందే అని వైసీపీ ఎంపిలు డిమాండ్ చేశారు. దీనిగురించి కేంద్రమంత్రి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీరు అడిగినట్లు నటించండి మేము విననట్లే నటిస్తామన్న పద్దతిలో జరిగిపోతోంది కేంద్రప్రభుత్వ-వైసీపీ ఎంపిల వ్యవహారమంతా. ఇటువంటి వ్యవహారాల వల్ల ఎంపిలకు, పార్టీలకు జరిగే నష్టం లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. టీడీపీ హయాంలో ఏమి జరిగిందో అందరు చూసిందే.

మొత్తం మీద ఏపి నుండి కొంతకాలం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపి అవసరాలేమిటో బాగా తెలుసు. అయినా బడ్జెట్లో కనీసం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదంటే కేంద్రానికి తెలుగు రాష్ట్రాలంటే ఎంత చిన్న చూపుందో అర్ధమైపోతోంది.

This post was last modified on February 1, 2021 2:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

60 mins ago

సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!

కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…

2 hours ago

తారక్ హృతిక్ జోడి కోసం క్రేజీ కొరియోగ్రాఫర్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…

2 hours ago

పుష్ప 2 ఖాతాలో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…

3 hours ago

ఏక్ష‌ణ‌మైనా.. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. రంగం రెడీ?

దేశ రాజ‌ధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్ర‌మేన‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…

4 hours ago

మృణాల్‌కు ముద్దు భయం

ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…

13 hours ago