తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స న్నిహితురా లు.. అన్నాడీఎంకేను ఒకప్పుడు శాసించిన శశికళ.. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు శిక్ష పూర్తయి.. సరిగ్గా ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలయ్యారు. కరోనాతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా.. రాజకీయ చర్చ అనూహ్య మలుపు తిరిగింది. చిన్నమ్మ రాకతో.. తమిళనాట అన్నాడీఎంకే చీలిపోతుందా? లేక మరింత బలోపేతం అవుతుందా? ఏదైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ తెరమీదికి వస్తుందా? అనే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
జయ తర్వాత.. అన్నాడీఎంకే పార్టీలో నెంబర్-2గా అనధికారికంగా చక్రం తిప్పారు శశికళ. గత ఎన్నికల్లో 40 శాతానికి పైగా అభ్యర్థులు శశికళ ఆశీర్వాదంతోనే టికెట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అంతేకాదు, మంత్రివర్గంలోనూ తన వారికి చోటు దక్కించుకున్నారు శశికళ. దీనిని బట్టి అన్నాడీఎంకేలో జయ తర్వాత స్థానం నిస్పందేహంగా శశికళదేనని అంటారు. ఈ నేపథ్యంలో రేపు ఆమె.. తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తే.. వీరంతా ఆమె గూటికి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. అన్నాడీఎంకేలో ఎవరూ కూడా బలమైన నాయకత్వం దిశగా అడుగులు వేయలేదు. జయ తర్వాత.. పార్టీ మాది! అని బలంగా ప్రజల్లోకి వెళ్లిన వారు కూడా లేరు. కేవలం పదవులు పంచుకోవడం, పాలన వరకే పరిమితమయ్యారు.
ఫలితంగా అన్నాడీఎంకేలో జయ తర్వాత.. ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది. అటు సీఎం పళని స్వామి కానీ, ఇటు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కానీ.. జయలేని లోటును తీర్చే ప్రయత్నాలు కానీ, బలమైన నేతలుగా ఎదిగే ప్రయత్నం కానీ చేయలేక పోయారు. పైగా.. అన్నాడీఎంకేను ఆది నుంచి జయ నడిపించారు. దీంతో లేడీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. ఫలితంగా పార్టీ తరఫున ఇప్పుడు శశికళ వాయిస్ వినిపిస్తే.. ప్రజలు ఆమె వైపు మొగ్గే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే.. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పళని స్వామి.. బీజేపీతో చేతులు కలిపారని.. కేంద్రంలోని బీజేపీనేతలతో టచ్లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
వాస్తవానికి తమపై హిందీని రుద్దుతున్నారన్న కోపంతోపాటు.. నీట్ సహా పలు పరీక్షల విషయంలో తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం పరిశీలించడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కావేరీ వివాదం మరోవైపు రగిలిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పళనిపై విశ్వాసం కన్నా..కూడా బీజేపీ అంటే భయపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిణామాలు కూడా శశికళకు కలిసి వస్తాయని అంటున్నారు. అంటే.. బీజేపీని విలన్గా చూసి.. చూపించే.. నాయకురాలిగా ఆమె కీలకరోల్ షోషిస్తారు. జరగాల్సింది ఎలాగూ జరిగిపోయింది. ఇక, ఇప్పుడు తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కేంద్రంలోని పెద్దలకు లేదు. దీంతో రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని పెద్దన్నగా మార్చి.. జయలలిత స్థానంలో శశికళ విజృంభించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on January 29, 2021 5:44 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…