తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స న్నిహితురా లు.. అన్నాడీఎంకేను ఒకప్పుడు శాసించిన శశికళ.. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు శిక్ష పూర్తయి.. సరిగ్గా ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలయ్యారు. కరోనాతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా.. రాజకీయ చర్చ అనూహ్య మలుపు తిరిగింది. చిన్నమ్మ రాకతో.. తమిళనాట అన్నాడీఎంకే చీలిపోతుందా? లేక మరింత బలోపేతం అవుతుందా? ఏదైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ తెరమీదికి వస్తుందా? అనే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
జయ తర్వాత.. అన్నాడీఎంకే పార్టీలో నెంబర్-2గా అనధికారికంగా చక్రం తిప్పారు శశికళ. గత ఎన్నికల్లో 40 శాతానికి పైగా అభ్యర్థులు శశికళ ఆశీర్వాదంతోనే టికెట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అంతేకాదు, మంత్రివర్గంలోనూ తన వారికి చోటు దక్కించుకున్నారు శశికళ. దీనిని బట్టి అన్నాడీఎంకేలో జయ తర్వాత స్థానం నిస్పందేహంగా శశికళదేనని అంటారు. ఈ నేపథ్యంలో రేపు ఆమె.. తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తే.. వీరంతా ఆమె గూటికి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. అన్నాడీఎంకేలో ఎవరూ కూడా బలమైన నాయకత్వం దిశగా అడుగులు వేయలేదు. జయ తర్వాత.. పార్టీ మాది! అని బలంగా ప్రజల్లోకి వెళ్లిన వారు కూడా లేరు. కేవలం పదవులు పంచుకోవడం, పాలన వరకే పరిమితమయ్యారు.
ఫలితంగా అన్నాడీఎంకేలో జయ తర్వాత.. ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది. అటు సీఎం పళని స్వామి కానీ, ఇటు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కానీ.. జయలేని లోటును తీర్చే ప్రయత్నాలు కానీ, బలమైన నేతలుగా ఎదిగే ప్రయత్నం కానీ చేయలేక పోయారు. పైగా.. అన్నాడీఎంకేను ఆది నుంచి జయ నడిపించారు. దీంతో లేడీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. ఫలితంగా పార్టీ తరఫున ఇప్పుడు శశికళ వాయిస్ వినిపిస్తే.. ప్రజలు ఆమె వైపు మొగ్గే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే.. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పళని స్వామి.. బీజేపీతో చేతులు కలిపారని.. కేంద్రంలోని బీజేపీనేతలతో టచ్లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
వాస్తవానికి తమపై హిందీని రుద్దుతున్నారన్న కోపంతోపాటు.. నీట్ సహా పలు పరీక్షల విషయంలో తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం పరిశీలించడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కావేరీ వివాదం మరోవైపు రగిలిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పళనిపై విశ్వాసం కన్నా..కూడా బీజేపీ అంటే భయపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిణామాలు కూడా శశికళకు కలిసి వస్తాయని అంటున్నారు. అంటే.. బీజేపీని విలన్గా చూసి.. చూపించే.. నాయకురాలిగా ఆమె కీలకరోల్ షోషిస్తారు. జరగాల్సింది ఎలాగూ జరిగిపోయింది. ఇక, ఇప్పుడు తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కేంద్రంలోని పెద్దలకు లేదు. దీంతో రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని పెద్దన్నగా మార్చి.. జయలలిత స్థానంలో శశికళ విజృంభించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on January 29, 2021 5:44 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…