Political News

పార్లమెంటు క్యాంటీన్లో ఇక సబ్సిడీలుండవ్

పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ క్యాంటీన్‌లో సబ్సిడీపై భోజనం అందిస్తుండడంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా సామాన్యుల మాదిరిగా రాయితీలు అందుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. మామూలుగా అయితే, నిరుపేదలకు, కార్మికులకు, కొన్ని రంగాల్లోని ఉద్యోగులకు సబ్సిడీపై క్యాంటీన్ లో భోజనం అందిస్తారని….పార్లమెంటులో మన రాజకీయ నేతలకు సబ్సిడీ ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సబ్సిడీ ఎత్తివేయాలని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో సబ్సిడీని తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా గత వారం ప్రకటించారు. ఈ క్రమంలోనే జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నుంచే సబ్సిడీ లేని ధరలు అమలుకానున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో పార్లమెంటు క్యాంటీన్లో కొత్త మెనూ, ధరలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటివరకు క్యాంటీన్ లో చికెన్ కర్రీని రూ.50 లకు, వెజ్ థాలిని రూ.35 లకు, హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.65, ఉడికించిన కూరగాయలు రూ.12లకు, మూడు కోర్సుల భోజనం ధర రూ.106, సాదా రూ.12లకు అందిస్తున్నారు.

ఇకపై, మారిన ధరల ప్రకారం రోటీ రూ.3, శాకాహార భోజనం రూ.100, వెజ్ బ‌ఫే రూ. 500, నాన్-వెజ్ లంచ్ రూ.700, హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.150, ఉడికించిన కూరగాయలు రూ.50లకు లభించనున్నాయి. గతంలో పార్లమెంట్ క్యాంటీన్‌కు ప్రతి ఏడాది సుమారు రూ.17 కోట్లను సబ్సిడీ కింద చెల్లిస్తున్నారు. తాజాగా సబ్సిడీని ఎత్తివేయడంతో ఏడాదికి రూ.8 కోట్లకు పైగా ఆదా అవుతుంది. కాగా, క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఐఆర్‌సీటీసీ లేదా ఐటీడీసీకి అప్పగించనున్నారు.

This post was last modified on January 28, 2021 4:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago