Political News

పార్లమెంటు క్యాంటీన్లో ఇక సబ్సిడీలుండవ్

పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ క్యాంటీన్‌లో సబ్సిడీపై భోజనం అందిస్తుండడంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా సామాన్యుల మాదిరిగా రాయితీలు అందుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. మామూలుగా అయితే, నిరుపేదలకు, కార్మికులకు, కొన్ని రంగాల్లోని ఉద్యోగులకు సబ్సిడీపై క్యాంటీన్ లో భోజనం అందిస్తారని….పార్లమెంటులో మన రాజకీయ నేతలకు సబ్సిడీ ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సబ్సిడీ ఎత్తివేయాలని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో సబ్సిడీని తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా గత వారం ప్రకటించారు. ఈ క్రమంలోనే జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నుంచే సబ్సిడీ లేని ధరలు అమలుకానున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో పార్లమెంటు క్యాంటీన్లో కొత్త మెనూ, ధరలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటివరకు క్యాంటీన్ లో చికెన్ కర్రీని రూ.50 లకు, వెజ్ థాలిని రూ.35 లకు, హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.65, ఉడికించిన కూరగాయలు రూ.12లకు, మూడు కోర్సుల భోజనం ధర రూ.106, సాదా రూ.12లకు అందిస్తున్నారు.

ఇకపై, మారిన ధరల ప్రకారం రోటీ రూ.3, శాకాహార భోజనం రూ.100, వెజ్ బ‌ఫే రూ. 500, నాన్-వెజ్ లంచ్ రూ.700, హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.150, ఉడికించిన కూరగాయలు రూ.50లకు లభించనున్నాయి. గతంలో పార్లమెంట్ క్యాంటీన్‌కు ప్రతి ఏడాది సుమారు రూ.17 కోట్లను సబ్సిడీ కింద చెల్లిస్తున్నారు. తాజాగా సబ్సిడీని ఎత్తివేయడంతో ఏడాదికి రూ.8 కోట్లకు పైగా ఆదా అవుతుంది. కాగా, క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఐఆర్‌సీటీసీ లేదా ఐటీడీసీకి అప్పగించనున్నారు.

This post was last modified on January 28, 2021 4:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago