అనుకున్నదంతా అయ్యింది. ఆరేడేళ్ల క్రితం మోడీ ప్రధానమంత్రి కావటానికి ముందు లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూపాయి.. రెండు పెరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవి. ఇలాంటివేళ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆసక్తికరమైన పోస్టులు వచ్చేవి. అసలుసిసలు దేశభక్తుడైన మోడీ కానీ ప్రధానమంత్రి అయితే దేశ రూపురేఖలు మారిపోతాయని.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని పేర్కొన్నారు. అంతేనా.. మోడీ పవర్లోకి వచ్చాక లీటరు పెట్రోల్ రూ.50కి.. డీజిల్ మరింత తక్కువకు వచ్చే సత్యకాలం దగ్గర్లోనే ఉందంటూ ఉదరగొట్టేశారు.
అలాంటి ఆశావాహుల అంచనాలకు తగ్గట్లే ఒకసారి కాదు.. రెండుసార్లు మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న మోడీ హయాంలోనే దేశంలోని ఒక ప్రాంతంలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటేసిన శుభదినంగా చెప్పాలి. ఆకాశమే హద్దుగా సాగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు నేపథ్యంలో అతి త్వరలోనే లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటేస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి.
ఈ రోజు ఢిల్లీలో సాధారణ పెట్రోల్ లీటరు ధర రూ.86.30 అయితే.. డీజిల్ ధర రూ.76.48గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.82 అయితే.. డీజిల్ రూ.81.71 అయ్యింది. జైపూర్ లో లీటరు పెట్రోల్ రూ.93.86 అయితే.. డీజిల్ లీటరు రూ.85.73గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటరు ధర రూ.89.77 కాగా.. డీజిల్ ధర రూ.83.46గా ఉంది. అమరావతిలో పెట్రోల్ లీటరు ధర రూ.92.54గా ఉంటే.. డీజిల్ ధర రూ.85.73గా ఉంది.
వ్యాట్ లో (దేశ వ్యాప్తంగా అన్ని వస్తువులకు జీఎస్టీ ఉంటే.. పెట్రోల్.. డీజిల్ లాంటి కొన్నింటికి మాత్రం వ్యాట్ రూపంలో పన్ను వేస్తున్నారు) ఉన్న తేడాల కారణంగా ఆయా రాష్ట్రాల ధరల్లో తేడా ఉంది. ఇదంతా పక్కన పెట్టి.. అసలు విషయానికి వస్తే రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఈ రోజు లీటరు పెట్రోల్ మీద 38 పైసలు పెంచటంతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు రూ.101.80గా నిలిచింది. మామూలు పెట్రోల్ కు.. ప్రీమియం పెట్రోల్ కు మధ్య శుద్దిలో తేడా ఉందని చెబుతారు. ఇవాళ ప్రీమియం పెట్రోల్.. రేపు మామూలు పెట్రోల్ ధర లీటరు సెంచరీ దాటేసే శుభదినాలుదగ్గర్లోనే ఉన్నాయని చెప్పాలి. తమ పాలనలో అచ్చే దిన్ వస్తుందన్న మోడీ నిజంగానే.. అచ్చే దిన్ అంటే ఏమిటో చూపిస్తున్నారని చెప్పకతప్పదు.
This post was last modified on January 28, 2021 3:33 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…