తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవక తప్పని పరిస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్లో చెప్పారు. తెలంగాణకు నలు వైపులా వేరే రాష్ట్రాల బార్డర్లు ఉన్నాయని.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలవడంతో అక్కడి నుంచి తెలంగాణలోకి మద్యం వస్తోందని.. 80 శాతం ప్రాంతాలకు మద్యం అందుతోందని.. అలాంటపుడు తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేయడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.
గత రెండు రోజుల్లో తెలంగాణ సరిహద్దులు దాటి అవతలకి వెళ్లి జనాలు మద్యం తెచ్చుకున్న మాట వాస్తవం. రెండు రోజుల కిందట ఏపీలో మద్యం దుకాణాలు ఆరంభిస్తే.. తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున మందుబాబులు పోటెత్తడం తెలిసిన సంగతే. ఐతే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు తెలంగాణకు మందుబాబులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో మద్యపానం పట్ల నిరాసక్తత పెంచే కారణం చూపించి ఏకంగా 75 శాతం మద్యం ధరలు పెంచేశారు. ఇది దారుణం అంటున్న వారి మాటను వినిపించుకునేవారు లేదు. ఐతే తెలంగాణలో కూడా మద్యం ధరలు పెంచినప్పటికీ.. అవి ఏపీతో పోలిస్తే తక్కువ మోతాదే. చీప్ లిక్కర్ మీద 11 శాతం.. మిగతా మద్యం మీద 16 శాతం ధరలు పెంచారు. దీంతో ఏపీ జనాలు తెలంగాణ సరిహద్దులు దాటి మద్యం కోసం ఇటు వైపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా ఏపీలో ఊరూ పేరూ లేని చీప్ బ్రాండ్స్ అమ్ముతున్నారు.
పేరున్న బ్రాండ్లేవీ కనిపించడం లేదు. అందుకోసం కూడా ఏపీ వాళ్లు తెలంగాణకు వచ్చే అవకాశముంది. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై సడలింపులు వచ్చాక మందు కోసమే చాలామంది అటు నుంచి ఇటొచ్చే అవకాశముంది. ధరలు స్వల్పంగా పెంచడం ద్వారా లాక్ డౌన్ తర్వాత కూడా అవి కొనసాగించడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో కూడా స్పష్టం చేశారు. ఏపీలో తర్వాత ఏ మేర ధరలు తగ్గిస్తారో కానీ.. ఆ రాష్ట్రంతో పోల్చుకుని మన దగ్గర చాలా నయం అని మందుబాబులు సులువుగానే కొత్త ధరలతో సర్దుకుపోతారు. ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత కూడా ఉండదు.
This post was last modified on May 6, 2020 1:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…