Political News

మోడి జమిలి ఎన్నికల జపానికి కారణం ఇదేనా ?

దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని నరేంద్రమోడి ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో మూలనపడిన జమిలి ఎన్నికలను మళ్ళీ ఎందుకని తెరపైకి తీసుకొచ్చారు ? ఎందుకంటే తాజాగా ఇండియాటుడే-కార్వీ సంస్ధలు నిర్వహించిన సర్వే సమాధానం చెబుతోంది. మూడ్ ఆఫ్ ది నేషన్ అనే విషయంలో జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు కానీ ఎప్పుడు ఎన్నికలు జరిపినా కానీ మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని తేలింది. అంటేట సర్వేలో చెప్పింది చెప్పినట్లు ప్రతిసారి జరుగుతుందనే గ్యారెంటీలేదు.

సర్వేలన్నవి జననాడి ఎలాగుందనే విషయంలో కాస్త స్టడీ చేయటానికి పనికొస్తుంది. ఇక విషయానికి వస్తే పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలే తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎక్కడా బీజేపీ కానీ ఎన్డీయేకానీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. తొందరలోనే పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని తేల్చిచెప్పాయి.

తమిళనాడులో డీఎంకే, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే చెప్పింది. అలాగే పశ్చిమబెంగాల్లో కూడా మమతా బెనర్జీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. అస్సాంలో మాత్రం బీజేపీ స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సర్వే ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీకి మైనస్సే అని తేలిపోయింది. అస్సాంలో మాత్రం అవకాశం ఉందని చెప్పిందే కానీ కచ్చితంగా వస్తుందనే గ్యారెంటీ ఇవ్వలేదు.

అంటే సర్వేల వల్ల ఏమి అర్ధమవుతోందంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయేకే జనాలు పట్టంకట్టినా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకే ఓటేస్తున్నారని. ఈ పద్దతినే మోడి తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమైపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రానా రాష్ట్రాల్లో అంతా బాగున్నట్లు కాదు కదా. ఈ పద్దతిపోయి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావాలంటే జమిలి ఎన్నికలు ఒకటే మార్గమని మోడి అనుకున్నట్లున్నారు.

అంటే పార్లమెంటుకు ఎన్డీయేకి ఓట్లేసే జనాలు ఆటోమేటిగ్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి లేదా ఎన్డీయేకే ఓట్లేస్తారని అనుకున్నట్లున్నారు. మరి మొన్నటి ఏపి ఎన్నికల్లో పార్లమెంటు+అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుకు అసెంబ్లీకి ఎక్కడా బీజేపీకి జనాలు ఓట్లేయలేదన్న విషయం మరచిపోకూడదు. ఏదేమైనా మోడి వ్యూహం ప్రకారం కేంద్ర+అసెంబ్లీలకు ఒకేసారి అంటే జమిలి ఎన్నికలు జరిగితేనే బీజేపీకి రెండు విధాల లాభమని అనుకున్నట్లున్నారు. అందుకనే జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు.

This post was last modified on January 23, 2021 5:38 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

11 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

12 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

13 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago