Political News

పవన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తొందలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎట్టి పరిస్దితిలోను ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధే పోటీకి దిగాలని, బీజేపీ అందుకు సహకరించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై మద్దతిచ్చే షరతు మీదే గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు ఎన్నికల నుండి తప్పుకున్నారన్న విషయాన్ని జనసేన నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

ఇవే విషయాలను పవన్ తో చెప్పి ఎట్టి పరిస్దితుల్లోను బీజేపీ నేతల ఒత్తిడికి లొంగవద్దని గట్టిగా చెబుతున్నారు. జనసేన పార్లమెంటరీ ఎఫైర్స్ కమిటి (పీఏసీ) నేతలతో గురువారం, శుక్రవారం పవన్ భేటీ కానున్నారు. ఈ భేటి కూడా వ్యూహాత్మకంగా తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. సమావేశంలో రెండు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉంది. మొదటిదేమో పోటీలో జనసేన అభ్యర్ధే ఉండాలి. రెండోదేమో బీజేపీ సహకరించాలి.

ఒకవేళ జనసేన డిమాండ్ కు బీజేపీ గనుక సహకరించకపోతే ఏమి చేయాలనే విషయాన్ని కూడా నేతలు చర్చించనున్నారు. ఎందుకంటే ఈమధ్య పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగిందట. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి పోటీకి మద్దతుగా జనసేన నేతలు కలిసి రాకపోతే జనసేనను పక్కన పెట్టేయాలని అనుకున్నారట. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి జనసేన నేతలు కూడా బాగా మంట మీదున్నారు.

మొత్తానికి ఉపఎన్నిక వ్యవహారం పవన్ మీద బాగా ఒత్తిడి పెంచేస్తోందన్నది వాస్తవం. ఇపుడు గనుక జనసేన అభ్యర్ధిని పోటీలోకి దింపలేకపోతే భవిష్యత్తులో జనసేన కమలం పార్టీకి తోకపార్టీగా మిగిలి పోవటం ఖాయమని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు లొంగకూడదని కూడా కీలకనేతలు పవన్ను గట్టిగా కోరుతున్నారు. మరి రెండు రోజుల పీఏసీ సమావేశంలో ఏమని డిసైడ్ చేస్తారో చూడాల్సిందే.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago