Political News

పవన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తొందలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎట్టి పరిస్దితిలోను ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధే పోటీకి దిగాలని, బీజేపీ అందుకు సహకరించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై మద్దతిచ్చే షరతు మీదే గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు ఎన్నికల నుండి తప్పుకున్నారన్న విషయాన్ని జనసేన నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

ఇవే విషయాలను పవన్ తో చెప్పి ఎట్టి పరిస్దితుల్లోను బీజేపీ నేతల ఒత్తిడికి లొంగవద్దని గట్టిగా చెబుతున్నారు. జనసేన పార్లమెంటరీ ఎఫైర్స్ కమిటి (పీఏసీ) నేతలతో గురువారం, శుక్రవారం పవన్ భేటీ కానున్నారు. ఈ భేటి కూడా వ్యూహాత్మకంగా తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. సమావేశంలో రెండు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉంది. మొదటిదేమో పోటీలో జనసేన అభ్యర్ధే ఉండాలి. రెండోదేమో బీజేపీ సహకరించాలి.

ఒకవేళ జనసేన డిమాండ్ కు బీజేపీ గనుక సహకరించకపోతే ఏమి చేయాలనే విషయాన్ని కూడా నేతలు చర్చించనున్నారు. ఎందుకంటే ఈమధ్య పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగిందట. ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి పోటీకి మద్దతుగా జనసేన నేతలు కలిసి రాకపోతే జనసేనను పక్కన పెట్టేయాలని అనుకున్నారట. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి జనసేన నేతలు కూడా బాగా మంట మీదున్నారు.

మొత్తానికి ఉపఎన్నిక వ్యవహారం పవన్ మీద బాగా ఒత్తిడి పెంచేస్తోందన్నది వాస్తవం. ఇపుడు గనుక జనసేన అభ్యర్ధిని పోటీలోకి దింపలేకపోతే భవిష్యత్తులో జనసేన కమలం పార్టీకి తోకపార్టీగా మిగిలి పోవటం ఖాయమని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు లొంగకూడదని కూడా కీలకనేతలు పవన్ను గట్టిగా కోరుతున్నారు. మరి రెండు రోజుల పీఏసీ సమావేశంలో ఏమని డిసైడ్ చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on January 22, 2021 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

1 hour ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

2 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

3 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

5 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

9 hours ago

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…

9 hours ago