సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు, అలంకరణ, ఫ్యాషన్ శైలికి అనుగుణంగా మార్చి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ రాజకీయ ప్రముఖులనూ ఆకర్షిస్తోంది. తామేమీ తక్కువ కాదన్నట్లుగా పలువురు రాజకీయ నాయకులు తమ ఫొటోలను కృత్రిమ మేధలో మార్చి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ఫొటోను ‘80ల ట్రెండ్’లో భాగంగా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అప్పటి దుస్తులు, ఫ్యాషన్ శైలిని ప్రతిబింబించేలా కృత్రిమ మేధ సాయంతో ఫొటోలను మార్చి నెటిజన్లు పంచుకుంటున్నారు. ఇందుకోసం సాధారణ ఫొటోలను 80ల నాటి రూపానికి మార్చేలా సూచనలు ఇచ్చి చిత్రాలను రూపొందిస్తున్నారు. వాటిని ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.
ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రజాప్రముఖులు, రాజకీయ నాయకులకూ విస్తరించింది. ఇదే క్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా తన ఫొటోను 80ల ట్రెండ్లో పంచుకున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం కృత్రిమ మేధతో రూపొందించిన చిత్రాలకు భిన్నంగా.. 1980ల నాటి తన అసలైన ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ‘‘80ల ట్రెండ్లో అసలైన వాటితో చేరుతున్నా.. ఆ దశాబ్దానికి చెందిన నా కొన్ని నిజమైన ఫొటోలు ఇవిగో’’ అంటూ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు పంచుకున్న పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
This post was last modified on September 11, 2026 2:22 pm
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…