నిజం గెలిచింది… నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న లోకేష్‌

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా లోకేష్‌ గుర్తుచేసుకున్నారు. 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 53 రోజులపాటు ఉన్నారు. ‘‘నిజం గెలిచింది’’ అంటూ నాటి చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి 53 రోజులపాటు ‘నిజం గెలవాలి’ అంటూ ఆయనకు అండగా నిలిచిందని లోకేష్‌ తెలిపారు. 2023 అక్టోబరు 31న హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారని గుర్తుచేశారు.

అనంతరం న్యాయస్థానాల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. ‘‘నిజం గెలిచింది’’ అని పేర్కొన్నారు. నాటి క్లిష్ట సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రతి ఒక్క తెలుగువారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబరు 9న రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమాలు నిర్వహించాలని లోకేష్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా టీడీపీ శ్రేణులు 53 దీపాలు వెలిగించి సంఘీభావం తెలియజేస్తున్నారు.