చివరకు ఒత్తిడికి వాట్సప్ యాజమాన్యం తలొంచిందనే అనుకోవాలి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి ప్రైవసీ పాలసీ అమల్లోకి వస్తుందని యాజమాన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ పాలసీని మూడు నెలలు వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. తాము కొత్తగా రూపొందించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకరించకపోతే వారికి ఫిబ్రవరి 8వ తేదీ నుండి వాట్సప్ సేవలు ఆగిపోతాయని గతంలోనే యాజమాన్యం ప్రకటించింది. ఎప్పుడైతే యాజమాన్యం ప్రకటించిందో అప్పటి నుండి యూజర్లు ప్రత్యామ్నాయాలను చూడటం మొదలుపెట్టారు.
ఇందులో భాంగంగానే జనవరి 5-12 తేదీల మధ్య వాట్సప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లకు మారిపోతున్నారు. మిలియన్లకొద్దీ యూజర్లు తమకు వాట్సప్ అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్లే చెప్పారు. వాట్సప్ స్ధానంలో వాట్సప్ కన్నా మెరుగైన ఫీచర్లున్నాయన్న కారణంగా యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లను తమ ఫోన్లనో డౌన్ లోడ్ చేసుకోవటం మొదలుపెట్టారు. నిజానికి యావత్ ప్రపంచాన్ని వాట్సప్ యాప్ లోని అద్భుత ఫీచర్లు బాగానే ఆకట్టుకుంటున్నాయి. కాకపోతే ఫేస్ బుక్ ప్రైవసీ పాలసీతో వాట్సప్ జత చేయబోతున్నట్లు ప్రకటించటంతోనే సమస్యలు మొదలయ్యాయి.
ఎప్పుడైతే యూజర్లు తమను వదిలి ప్రత్యామ్నాయాలను చూసుకోవటం మొదలుపెట్టారో అప్పుడు కానీ వాట్సప్ యాజమాన్యానికి జ్ఞానోదయం కాలేదు. ఎలాగూ వాట్సప్ కు అలవాటు పడ్డారు కాబట్టి తాము ఏమి చెప్పినా జనాలు చచ్చినట్లు వింటారని వాట్సప్ యాజమాన్యం అనుకున్నది. అయితే సీన్ రివర్స్ కావటంతో వేరేదారి లేక తమ ప్రైవసీ పాలసీని మూడునెలలు వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది.
తాము తమ యూజర్ల మధ్య జరిగే మెసేజీలను చదవమని, యూజర్ల మధ్య జరిగే సంభాషణలు మరొకరు వినరని, యూజర్ల లొకేషన్ కూడా మరొకళ్ళకి తెలియదని..ఇలాంటి అనేక హామీలిస్తోంది ఇఫ్పుడు. అయితే యాజమాన్యం ఇపుడు చెప్పిందంతా ఇప్పటికే అమల్లో ఉన్నదే. మరలాంటపుడు కొత్తగా యాజమాన్యం యూజర్లకు ఇఛ్చిన హామీ ఏమీలేదు. యూజర్ల సమాచారాన్ని వాట్సప్ ఏ విధంగాను ఫేస్ బుక్ దగ్గర వాడనపుడు ఇక యూజర్ల కోస ప్రైవసీ పాలసీని అమలు చేయాలని అనుకోవటంలో అర్ధమేంటి ? మొత్తానికి యూజర్లదెబ్బకు వాట్సప్ యాజమాన్యం దిగొచ్చినట్లే అనిపిస్తోంది. మరి మేనెల తర్వాత ఇంకేమి చెబుతుందో చూద్దాం.
This post was last modified on January 17, 2021 10:46 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…