ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్ ఆర్టీసీ మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడలో ‘హోమ్ పికప్’ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇక బస్టాండ్కు వెళ్లేందుకు ఆటోలు, ఇతర వాహనాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా.. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఆర్టీసీ బస్సే ప్రయాణికుల ఇంటి వద్దకు వచ్చి పికప్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.
ప్రస్తుతం విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ఈ సేవను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన కనీసం ఆరుగురు ప్రయాణికులు టికెట్లు రిజర్వ్ చేసుకుంటే, వారి ఇంటి వద్దకు బస్సును పంపించి ప్రయాణికులను పికప్ చేస్తారు. బస్టాండ్ దూరాన్ని బట్టి ఇందుకోసం స్వల్ప రుసుము వసూలు చేయనున్నారు.
ఈ సదుపాయాన్ని పొందాలనుకునే ప్రయాణికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య, బస్సు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించే వారికి ఈ సేవ మరింత ఉపయోగకరంగా ఉండనుంది.
ముఖ్యంగా భారీ లగేజీతో బస్టాండ్కు చేరుకునే ఇబ్బందులు తగ్గనున్నాయి. విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ‘హోమ్ పికప్’ సేవకు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది.
This post was last modified on September 1, 2026 10:39 pm
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…
ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి…