ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల్ని మళ్లీ తెరవడంతో నిన్న ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి కానీ ఏపీలో మాత్రం భయానక దృశ్యాలు కనిపించాయి. అసలేమాత్రం జనాలపై నియంత్రణ కనిపించలేదు. సోషల్ డిస్టెన్స్ లేదు. మాస్కుల్లేవు. ఒకే చోట వందలు, వేలమంది గుమిగూడి ఒకరినొకరు తోసుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలు కరోనా విషయంలో జనాల్ని కంగారు పెట్టేస్తున్నాయి.
దీనికి తోడు మద్యం దుకాణాల వద్ద జనాల్ని నియంత్రించే డ్యూటీలకు ఉపాధ్యాయుల్ని వేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ సర్కారును నిలదీశాడు. భర్త తాగొచ్చి తన్నడంతో భార్య, కుమార్తె చనిపోయిన వార్తను షేర్ చేస్తూ.. ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోవడం పట్ల ఇలాంటి దారుణాలు జరగడం బాధాకరమని పవన్ అన్నాడు.
ఇక ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేశారన్న వార్తను షేర్ చేస్తూ.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బతికుండా ఇలాంటివి చూస్తే ఎలా స్పందించేవాడో అని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటివి గురువుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని పవన్ అన్నాడు.
ఇక మద్యం దుకాణాల వద్ద జనసందోహం నెలకొన్న వీడియోలను షేర్ చేసిన పవన్.. ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేస్తామని జగన్ సర్కారు హామీ ఇచ్చిందని.. ఈ లాక్ డౌన్ టైంలో నిషేధాన్ని గట్టిగా అమలు చేయడానికి మంచి అవకాశం ఉందని.. కానీ ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఆదాయం కోసమని మద్యం దుకాణాలు మళ్లీ తెరించిందని పవన్ విమర్శించాడు. ఎక్కడా సోషల్ డిస్టన్స్ అన్నదే లేదని.. దేవాలయాలు, మసీదులు, చర్చిలను కరోనా భయంతో మూసి వేసి.. లిక్కర్ షాపులు మాత్రం తెరవడంలో ఆంతర్యమేంటని పనవ్ ప్రశ్నించాడు.
This post was last modified on May 5, 2020 5:48 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…